నేడు ప్రారంభించనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్
మందులు, ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులోకి: ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి/ పెనుబల్లి, మే 15: సత్తుపల్లి నియోజకవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నందున పెనుబల్లి వైద్యవిధాన పరిషత్ హాస్పిటల్లో 25 బెడ్లతో సోమవారం కొవిడ్ ఐసోలేషన్ వార్డును ప్రారంభిస్తున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మంలో కలెక్టర్ కర్ణన్ను ఆదివారం కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్రా సరిహద్దుగా ఉండడంతో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. అందుకని నియోజకవర్గంలో కరోనా పరీక్షలు, ఆక్సీజన్ సిలిండర్లు, మందులు, ఇతర సౌకర్యాలు పెంచాలని మంత్రి కేటీఆర్ను సంప్రదించామన్నారు. దీంతో ఆయా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కరోనా ఐసోలేషన్ వార్డులో మందులు, ఆక్సీజన్ సిలిండర్లు, రెమ్డిసివిర్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఐసోలేషన్ వార్డును మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే నియోజకవర్గంలో వరిధాన్యం కొనుగోలును పెంచాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు సండ్ర తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల సేవ ఆదర్శం
ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవచేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.లక్ష విలువైన పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సీప్లో మీటర్లు, హాట్, కూల్ వాటర్ ఫ్రిడ్జ్, రెయిన్ప్రూఫ్ టెంట్, 50 కుర్చీలను ఎమ్మెల్యే సండ్ర చేతులమీదుగా ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుమతిదేవికి అందజేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఉడతనేని సత్యం చారిటబుల్ ట్రస్టు వెంకటేశ్వరరావు రూ.30 వేలు, యువభారత్శక్తి క్రాంతి రూ.15 వేలు, వాసవీ క్లబ్ రూ.10 వేలు, సుభాశ్ యువజన సంఘం రూ.10 వేలు, కృప వర్షిత చారిటబుల్ ట్రస్టు రూ.10 వేలు, గురుజ్యోతి సంస్థ రూ.10 వేలు, అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రూ.5 వేలు, గూడూరు సర్వేశ్వరరావు బ్రిక్స్ రూ.5 వేలు చొప్పున ప్రభుత్వ ఆసుపత్రికి వితరణను అందించడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ కమిషనర్ సుజాత, చైర్మన్ కూసంపూడి మహేశ్, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.