అమరావతి : గుంటూర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. గుంటూర్ సీఐడీ కార్యాలయంలో పోలీసులు తనను కొట్టారని నిన్న రఘురామ సీఐడీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ తరఫు న్యాయవాదులు ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో రఘురామకు పరీక్షలు నిర్వహించి ఉదయం 10 గంటల 30 నిమిషాల కల్లా మెడికల బోర్డు నివేదిక అందజేయాలని జిల్లా కోర్టు, మధ్యాహ్నం 12లోగా ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కోరింది.
మరికాసేపట్లో మెడికల్ బోర్డు నివేదిక హైకోర్టుకు చేరే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రమేశ్ హాస్పటల్కు తరలించాలని కోర్టు నిన్ననే ఆదేశించింది. ఇంకా పరీక్షలు కొనసాగుతుండటంతో ఆయనను ఎక్కడికి తీసుకెళ్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఎంపీ రఘురామను రెండురోజుల క్రితం ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.