సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ)/ సుల్తాన్బజార్ : కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి ఎన్టీపీసీ సంస్థ తరపున పలు వస్తువులను సోమవారం అందజేశారు. ప్రస్తుతం, కరోనా వైరస్ నివారణ కోసం ఈఎన్టీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం వేలాది మంది ఇక్కడకు వస్తున్నారు. స్థానికంగా అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన ఎన్టీపీసీ ఉద్యోగులు సుమారు రూ.80 వేల విలువ చేసే కుర్చీలను, షామియానాలను అందజేశారు. ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్కు సోమవారం అందజేశారు. అదే విధంగా ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు తాము మరింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్టీపీసీ ఉద్యోగులు తెలిపారు. అదే విధంగా ఉప్పల్ వెంకట్రెడ్డినగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు 20 కుర్చీలను, ఒక షామియానాను అందజేశారు