చెన్నై: ఏనుగుల మందలు అప్పుడప్పుడు అడవుల నుంచి దారితప్పి సమీప గ్రామంలో ప్రవేశిస్తుంటాయి. ఇలా ఏనుగుల మంద గ్రామంలో ప్రవేశించిందంటే చాలు ఊరుఊరంతా గడగడా వణికిపోతుంది. ఏనుగులు చేసే బీభత్సం అంత దారుణంగా ఉంటుంది మరి. వందల ఎకరాల పంటను క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. తాజాగా తమిళనాడులోని ఓ గ్రామంలో కూడా ఏనుగుల మంద ప్రవేశించి బీభత్సం సృష్టించింది. కానీ, పోతూపోతూ ఒక మంచి పని కూడా చేసి వెళ్లింది. మరి ఆ మంచి పని ఏమిటో తెలియాంటే కింది వివరాలు చదవాల్సిందే..
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళ పట్టణ శివార్లలో కృష్ణసామి అనే రైతుకు అరటి తోట ఉంది. ఇటీవల సమీప అడవుల్లోంచి దారితప్పి వచ్చిన ఓ ఏనుగుల మంద కృష్ణసామి అరటి తోటపై దాడి చేసింది. తోటలోని 300కు పైగా అరటిచెట్లను ఏనుగులు తొక్కేశాయి. కానీ ఒక్కచెట్టును మాత్రం వదిలేశాయి. ఏనుగుల బీభత్సం తర్వాత గ్రామస్తులతో కలిసి తోటను పరిశీలించేందుకు వెళ్లిన రైతు కృష్ణసామి.. ఆ తోటలో ఒక్క అరటి చెట్టు మాత్రమే విరిగిపోకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
ఏనుగులు ఆ ఒక్క చెట్టునే ఎందుకు వదిలేశాయా అని వెళ్లిచూడగా.. ఆ చెట్టుపై ఒక పక్షి గూడు కనిపించింది. ఆ గూట్లో కొన్ని పక్షి పిల్లలు కూడా ఉన్నాయి. అంటే పక్షి పిల్లలను చూసే ఏనుగులు ఆ చెట్టును వదిలేశాయని గ్రామస్తులు గ్రహించారు. ఆ పక్షి పిల్లలను, ధ్వంసమైన తోటను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఓ లోకల్ ఛానెల్ ఆ వీడియోను ప్రసారం చేయడంతో విషయం ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ దృష్టికి వెళ్లింది.
ఏనుగులు చూపిన ఈ దయాగుణాన్ని మాటల్లో చెప్పలేం అంటూ ఆయన ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి ఆ వీడియోపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఆ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?