న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంక్ నోట్ ప్రెస్ (బీఎన్పీ)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 11 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు మధ్యప్రదేశ్లోని దేవాస్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నోయిడాలోని ఇండియా గవర్నమెంట్ మింట్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 135
ఇందులో జూనియర్ టెక్నీషియన్ 113, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 15, సూపర్వైజర్ 2, వెల్ఫేర్ ఆఫీసర్ 1, గవర్నమెంట్ మింట్లో.. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 3, సెక్రటేరియల్ అసిస్టెంట్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ, సూపర్వైజర్ పోస్టులకు డిప్లొమా, మిగిలిన పోస్టులకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 25 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్టెనోగ్రఫీ టెస్ట్, టైపింగ్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: bnpdewas.spmcil.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి