అనాలోచిత నిర్ణయాలతో దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు
సరిపడా ఆక్సిజన్ లేదు..టెస్టింగ్ కిట్లు లేవు
టీకాను విదేశాలకు అమ్ముకోవడం శోచనీయం
ముందుచూపులేకనే మందుల కొరత
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ధ్వజం
జగిత్యాల రూరల్, మే 5: ‘కరోనా కట్టడిలో కేం ద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైంది.. స్వార్థపూరిత, అనాలోచిత నిర్ణయాలతో దేశంలో వైద్య సంక్షోభం తలెత్తె పరిస్థితి వచ్చింది’ అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే నరేంద్రమోడీ చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రోగులకు కనీసం ఆక్సిజన్, మందులు అందించలేని దుస్థితికి దిగజారిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగిత్యాల ప్రెస్క్లబ్లో బుధవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి విపత్కర సమయంలో కేంద్ర సర్కారు ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్ ప్రజలకు సరైనా సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దేశంలో తొలిదశ వైరస్ నియంత్రణలో విఫలమైన కేంద్రం మలిదశలో మరింత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. కొవిడ్కు అడ్టుకట్ట వేస్తున్న తెలంగాణకు అవసరం మేరకు వ్యాక్సిన్ సరఫరా చేయకపోవడం బాధాకరమన్నారు. మన రాష్ట్రం లో తయారయ్యే టీకాలను విదేశాలకు అమ్ముకున్న మోడీ దేశ ప్రజలను కరోనాకు బలిపెడుతున్నారని విరుచుకుపడ్డారు. టెస్టింగ్ కిట్లు, రెమ్డెసివిర్ ఇం జక్షన్లు అందించడంలేదని ఆక్షేపించారు. కనీసం బహిరంగ మార్కెట్లో కొందామన్నా లభించడంలేదన్నారు. కరోనా బారినపడి అనేక మంది మ రణిస్తున్నారని, ఇటీవల జిల్లాలో ఓ ఎంపీపీ ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందన్నారు.
ఎంపీలు ఏం చేస్తున్నారు?
వ్యాక్సిన్లు లేక, టెస్టింగ్ కిట్లు రాక, మందుల కొరతతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే బీజేపీ ఎంపీలు అర్వింద్, బండి సంజయ్ ఎం చేస్తున్నారని నిలదీశారు. వీరు ఏనాడైనా రాష్ట్రంలో కరోనా పరిస్థితులను అధ్యయనం చేశారా? అంటూ ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశ ప్రజానీకం కొవిడ్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి నడ్డివిరిచారని దుయ్యబట్టారు. కేంద్రం ఆక్సిజన్ సరఫరా చేయకపోవడంతో యుద్ధవిమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా మేలుకొని వైరస్కు అడ్డుకట్టవేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరా రు. ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చల్గల్ సర్పంచ్ ఎల్ల గంగనర్సు రాజన్న, కౌన్సిలర్ నారాయణరెడ్డి, బాల ముకుందం, కిషన్ ఉన్నారు.