మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా.. మీకు రూ.20 లక్షల రుణం పొందే అర్హత ఉంది అంటూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారిని బురిడీ కొట్టించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన ఓ వ్యాపారి ఇటీవల ఫేస్బుక్లో ఓ ప్రకటనను చూశాడు. అందులో ఉన్న లింక్ను క్లిక్ చేయగానే.. టాటా క్యాపిటల్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటూ పేజీ తెరుచుకుంది. అందులో తనకు వ్యక్తిగత రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆ వెంటనే అతనికి మూడు నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. వారంతా ధ్రువీకరణ పత్రాలను సేకరించారు. ఆ తర్వాత ఫోన్ చేసి మీకు రూ.20 లక్షల రుణం వస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.12,199 చెల్లించాలని కోరారు. తర్వాత జీఎస్టీ, ఈఎంఐ, స్టాంప్ డ్యూటీ చార్జీలంటూ మొత్తం రూ.3.93 లక్షలు వసూలు చేశారు.