మన దేశంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, ఆయన సరసన సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ లంకేయుడిగా కనిపించనున్నారు. సన్నీసింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నటీనటులు చాలా కష్టాలు పడుతున్నారు.
ఆదిపురుష్ సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లేందుకు ప్రధాన పాత్రధారులు చాలా కష్టపడుతున్నారని ఓం రౌత్ మీడియాతో చెప్పుకొచ్చారు. కృతిసనన్ తెలుగులో డబ్బింగ్ చెప్పేందుకు నిపుణుడైన కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంటుంది. సీత పాత్రకు చాలా డైలాగులు ఉంటాయ్ అందుకే తనకు తానుగా డబ్ చెప్పేందుకు సిద్దమైంది. సీత ఆహార్యం కోసం ఫుడ్ విషయంలోను కృతి చాలా త్యాగాలు చేస్తుందని ఆయన అన్నారు. కృతి సనన్ తెలుగులో పలు సినిమాలు చేసిన ఏ ఒక్క సినిమాతో అలరించలేకపోయింది. ఆదిపురుష్తో మంచి వినోదం అందించాలని చాలా కష్టపడుతుంది.