డిమాండ్ ఉన్న వాటినే పండించాలి
ఆరున్నరేండ్లలోనే అన్నపూర్ణగా తెలంగాణ
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
ఖాసీంనగర్ క్లస్టర్ రైతువేదిక ప్రారంభం
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నాయకులు
వనపర్తి రూరల్, ఏప్రిల్ 9: రైతులు డిమాండ్ ఉన్న, సంప్రదాయ పంటలు సాగుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని ఖాసీంనగర్ క్లస్టర్ పరిధిలోని రైతువేదికను శుక్రవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 52 లక్షల 70ఎకరాల్లో సాగవుతున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం లో ఇప్పటి దానిలో 5శాతం మాత్రమే ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో దేశం మొత్తంలో తెలంగాణ నుంచే 50 శాతం వరి సాగవుతున్నదన్నారు. ఆరున్నరేండ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారిందనడానికి గతేడాది ఎఫ్సీఐ ధాన్యం సేకరణ మన రాష్ట్రం నుంచి చేయడమే నిదర్శమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు మన రాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. రైతు వేదికల ద్వారా ప్రపంచ నూతన వ్యవసాయ పద్ధతులను వీక్షించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు.
అలాగే రైతు వేదికల నుంచే విత్తనాలు, ఎరువులు తదితర వాటిని స్వయంగా రైతు ఏటీఎం మిషన్ మాదిరిగానే కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకు వచ్చే విధానం తీసుకొస్తున్నామన్నారు. రైతులు కంది, ఆయిల్పాం పంటలపై దృష్టి సారించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇస్తున్నాయన్నారు. మన ప్రాం తం ఆయిల్పాం తోటలకు అనుకూలమని శాస్త్రవేతలు సూచిస్తున్నారన్నారు. అంతకుముందు ఎద్దులగేరిలో మా ర్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు సక్రునాయక్ ఆధ్వర్యంలో 60మంది బీజేపీ నాయకులు, మహిళలు, యువకులు మంత్రి సమక్షంలో రాములు, తిరుపతి, యాద య్య, స్వామి తదితరులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఖాసీంనగర్ గ్రామ పంచాయతీలో ఏర్పా టు చేసిన క్రిమిటోరియంను మంత్రి నిరంజన్రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో అమరేంద్ర, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్రెడ్డి, పంచాయతీ ఈఈ మల్లయ్య, సర్పంచులు రమాదేవి, మురళి, దేవేంద్రనాయుడు, సహకార సం ఘం చైర్మన్ మధుసూదన్రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, ఎంపీటీసీ నాగరాజు, కోళ్ల వెంకటేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేశ్గౌడ్, సుదర్శన్రెడ్డి, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.