కొడంగల్, ఏప్రిల్ 7 : ప్రస్తుత వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమీక్షించారు. బుధవారం మిషన్ భగీరథ అధికారులతో హైదరాబాద్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వచ్చే మరో రెండు నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్న పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు, రైతు వేదికలకు మిషన్ భగీరథ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైప్లైన్ల లీకేజీ సమస్య ఆయా ప్రాంతాల్లో ఉందని, తద్వారా కలుషిత నీరు పైప్లైన్లో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
మిషన్ భగీరథ పనుల్లో పురోగతి, గ్రామాల్లో తాగునీటి సమస్య పరిస్థితులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లలో భాగంగా సీసీ రోడ్ కటింగ్ పనులు దాదాపు 70శాతం వరకు పూర్తయ్యాయని, త్వరలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. పనుల నిర్వహణకు సంబంధించి మెటీరియల్కుగాను రూ.3కోట్ల వరకు ఖర్చు అవుతుందని గతంలో అధికారులు తెలిపారని.. అందుకు సంబంధించి మెటీరియల్ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. మెటీరియల్ అందుబాటులో ఉంది కాబట్టి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ కూడా చదవండీ..
అత్యవసరమైతేనే జనం బయటకు రావాలి : హెల్త్ డైరెక్టర్
గంగమ్మ పొంగె.. రైతన్న ఉప్పొంగె..
త్వరలో పని ప్రదేశాల్లోనే కొవిడ్ టీకాలు..
బూత్ లోకి వెళ్లింది..బుక్కైంది ?