కర్ణాటక సరిహద్దులో జోరుగా జూదం..
తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించొచ్చని ఆశ
జీవితాలను నాశనం చేసుకుంటున్న పేదలు, కూలీలు
ముంబయి కేంద్రంగా కొనసాగుతున్న దందా
ప్రస్తుతం ఆన్లైన్లో నిర్వహణ.. చెల్లింపులు
జహీరాబాద్ డివిజన్లో రెచ్చిపోతున్న నిర్వాహకులు
జహీరాబాద్, ఏప్రిల్ 4 :మట్కా కొందరి జీవితాలను నరకంలోకి నెట్టేస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కష్టపడి సంపాదించిన కాస్త డబ్బును ఇందులో పెట్టి నష్టపోతున్నారు. ఫలితంగా అనేకమంది అప్పుల పాలవుతుండగా, మరికొందరు ఆస్తులు సైతం అమ్ముకుని వారితో పాటు కుటుంబాలను రోడ్డు మీద పడేస్తున్నారు. పేదలు, కూలీలు, మధ్యతరగతి వారే లక్ష్యంగా జహీరాబాద్ డివిజన్లో ఈ దందా జోరుగా సాగుతున్నది. ఈ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దున ఉండడంతో స్థానికులు, రెండు రాష్ర్టాలకు చెందిన నిర్వాహకులు జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ , మొగుడంపల్లి మండలాల్లోని గ్రామాల్లో మకాం వేసి గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ప్రస్తుతం మట్కాను ఆన్లైన్లో నిర్వహిస్తుండడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరిని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. ప్రధాన ఏజెంట్లు, సబ్ ఏజెంట్లకు ఫోన్ చేసి నెంబర్ చెప్పి, డబ్బులను కూడా చెల్లిస్తుండడంతో ఆడేవారు.. నిర్వాహకులు.. దొరక్కుండా తప్పించుకుంటున్నారు.
జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న జహీరాబాద్ మట్కాకు అడ్డాగా మారింది. మట్కా నివారణలో పోలీసు లు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నా ప్రధాన నిర్వాహకులపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. దీంతో మట్కా యథేచ్ఛగా నడుస్తోంది. జహీరాబాద్లో వీధివీధికి మట్కా నిర్వాహకు లు ఉండడం గమనార్హం. నిర్వాహకులు జహీరాబాద్, బీదర్, హుమాన్నాబాద్, ముంబయి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం , రాయికోడ్ మొగుడంపల్లితోపాటు మహారాష్ర్టాల వారితో సంబంధాలు ఏర్పరచుకొని దందాను గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. వీరికి రాజకీయ అండదండలు ఉం డడంతో మరింత రెచ్చిపోతున్నారు. దీంతో పేదలు, కూలీలు మట్కా నిర్వాహకుల చేతిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. నిర్వాహకులు మాత్రం రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు రూ.లక్షలు చెల్లింపులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ కేంద్రాలు …
కర్ణాటక సరిహద్దులో ఉన్న జహీరాబాద్, కోహీ ర్, న్యాల్కల్ , మొగుడంపల్లి మండల సరిహద్దు గ్రామాలే కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రతి రోజు రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. ముంబాయి కేంద్రంగా మట్కా జూదం సాగుతుంది. రాత్రి వరకు నంబర్లు ఆటకు రూపాయికి రూ. 80 చెల్లిస్తుండగా, పాన్ నంబరు పేరిట క్లోజిం గ్ నంబరుకు జరిగే జూదానికి రూపాయికి రూ.ఎనిమిది చెల్లిస్తారు. ఓపెనింగ్ క్లోజింగ్ అంకెలంటూ మట్కా జూదం జహీరాబాద్ డివిజన్లో జడలు విప్పుతోంది. మట్కా వ్యసనం బారిన పడిన అనేకమంది పేదలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మట్కాలో తక్కువ డబ్బులు చెల్లించి, ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చన్న అత్యాశతో పేద, మధ్యతరగతి, కూలీలతోపాటు ధనికులు వ్యసనానికి అలవాటుపడి ఉన్నదంతా ఊడ్చి రోడ్డునపడుతున్నారు. మట్కా ఆడిన అనేక మంది అప్పుల పాలు కాగా, మరికొందరు ఆస్తులు సైతం అమ్ముకుని రోడ్డునపడిన సంఘటనలు ఉన్నాయి.
సరిహద్దు గ్రామాలే అడ్డాలు..
జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలంలో ఉన్న మట్కా ప్రధాన నిర్వాహకులకు జిల్లా నలుమూల నుంచి సంబంధాలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రాలో ఉన్న ప్రధాన నిర్వాహకుల నుంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోని జోరుగా సాగిస్తున్నారు. గతంలో కొన్నిచోట్ల మాత్రమే ఉన్న మట్కా ప్రస్తుతం జహీరాబాద్ డివిజన్లో జోరుగా సాగుతుంది. జహీరాబాద్ సబ్ డివిజన్లో పని చేస్తున్న కొందరు పోలీసు అధికారుల అండతో మాట్కా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
మట్కాను నివారించేందుకు చర్యలు
జహీరాబాద్ డివిజన్లో మట్కా నిర్వహణపై ప్రత్యే క నిఘా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం మట్కాను నివారించేందుకు పోలీసు స్టేష న్లవారీగా నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం. మాకు సమాచారం అందిన వెంటనే దాడులు చేసి కేసులు నమో దు చేస్తాం. మట్కా నడుస్తున్నట్లు సమాచారం లేదు. మట్కా ఆన్లైన్లో నిర్వహణ చేయడం తో గుర్తించడం కష్టంగా మారింది. మట్కా నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన సంఘటనలూ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
జవాన్ల మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
కట్టేసి కొట్టారు.. కలతచెంది ప్రాణం తీసుకున్నాడు
గ్రేటర్లో న్యూ జనరేషన్ ట్రామ్ వే