న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వాహన సంస్థలకు గిరాకీ నెలకొన్నది. వాహన తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్లు గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా వ్యక్తిగత వాహనాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం ఇందుకు కారణం. వీటితోపాటు టయోటా, హోండా కార్స్, మహీంద్రాలకు చెందిన వాహనాలకు కూడా కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించింది. ఈ నెల నుంచి వాహన ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. మారుతి, హ్యుందాయ్ అమ్మకాలు ఇంచుమిం చు రెండు రెట్లు పెరుగగా, టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన అమ్మకాలు నాలుగు రెట్లకంటే అధికంగా పెరిగాయి.