హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ తార రష్మిక మందాన.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించనున్నదని సమాచారం. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో సినిమా తెరకెక్కనున్నది. గతేడాదే తాను ఒక సినిమా కోసం త్రివిక్రం శ్రీనివాస్తో కలిసి పని చేయనున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గతేడాది ఏప్రిల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది.
జూనియర్తో జోడీకి రష్మిక సిద్ధం
ప్రస్తుతం బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన రష్మికా మందాన.. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వేసవిలో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలే హైదరాబాద్లోని త్రివిక్రం శ్రీనివాస్ కార్యాలయానికి ఆమె రావడం ఈ వార్తలకు బలం చేకూరుతున్నది. త్రివిక్రం శ్రీనివాస్తో భేటీ దృశ్యాలను రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వైరలయ్యాయి. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులో పని చేసేందుకు ఆమె సంతకం చేశారని వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడొచ్చు. గత నెల 19వ తేదీన ట్విట్టర్ వేదికగా త్రివిక్రం శ్రీనివాస్ స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం పని చేసేందుకు వేచి చూస్తున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ 30వ సినిమా ఇలా..
జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాను హరిక అండ్ హసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాహుబలి జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఎన్టీఆర్ తన 30వ సినిమాలో నటించనున్నారు. ఇంతకుముందు అరవింద సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రం శ్రీనివాస్ కలిసి పని చేశారు.