హైదరాబాద్ : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని హయత్నగర్లో శనివారం చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి 600 లిక్కర్ బాటిళ్లు, ఓ కారు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డులోని కొహెడ గ్రామ సమీపంలో లిక్కర్ అక్రమ రవాణాను గుర్తించారు. నిందితులను రమావత్ దామోదర్, రమావత్ హరి గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లలో రాయల్ ఛాలెంజ్ 2 వేల ఎంఎల్ 8 బాటిళ్లు, సిగ్నేచర్ 2 వేల ఎంఎల్ 4 బాటిళ్లు, బ్లెండర్ ప్రైడ్ 750 ఎంఎల్ 12 బాటిళ్లు, ఓల్డ్ అడ్మిన్ 180 ఎంఎల్ 576 బాటిళ్లు ఉన్నాయి. తెలంగాణలో కంటే ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉన్న విషయం తెలిసిందే.