బాలాసోర్: దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల తయారీలో కీలకమైన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్డీఆర్) సాంకేతికతను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. క్షిపణిలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేశాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 160 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న అస్త్ర మార్క్-2 క్షిపణి తయారీలో ఎస్ఎఫ్డీఆర్ టెక్నాలజీ కలకం కానుందని పేర్కొన్నారు.