న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ రుసుమును రూ.10 నుంచి రూ. 30కి పెంచుతున్నట్లుగా భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను నియంత్రించడానికి, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రుసుము పెంపు నిర్ణయం తాత్కాలికమేనని, తర్వాత రేట్లను సవరిస్తామని ఈ సందర్భంగా రైల్వే శాఖ తెలిపింది.