ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : వానకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్స న్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం 10 గంటల కు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఇండ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీటితో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందన్నారు. తడి, పొడి చెత్తను పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. దోమల వ్యాప్తితో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వార్డులోని ఇంటింటికి తిరుగు తూ దోమల వ్యాప్తిపై అవగాహన కల్పిస్తూ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిశుభ్ర వాతావరణంలో బ్లీచింగ్, క్లోరైడ్ పిచికారీ చేశారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, కమిషనర్ రమేశ్, కౌన్సిలర్ తబస్సుబ్బేగమ్, కోఆప్షన్ ఈటె కిషన్చంద్, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, సెప్టెంబర్ 19 : డెంగీ, మలేరియా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జయమ్మ అన్నారు. ఆదివారం పట్టణంలోని 13, 15, 10 వార్డుల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఖాజామైనోద్దీన్, రామ్మోహన్రెడ్డి, తిరుపతయ్య, కోఆప్షన్ సభ్యులు వసీం, వహీద్, డాక్టర్ సాజద్, చాంద్పాషా ఉన్నారు.
అమరచింతలో..
అమరచింత, సెప్టెంబర్ 19 : పట్టణ ప్రజలు అంటువ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ సూచించారు. ఆదివారం మున్సిపాలిటీలోని 4 వవార్డులో డ్రైడే సందర్భంగా కౌన్సిలర్ సింధుజతో కలిసి ఇంటింటికి వెళ్లి సీజనల్ వ్యాదులపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్, సిబ్బంది మహంకాళి ప్రభాకర్, హరికృష్ణ, సునిల్, ఉన్నారు.