నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/నాగర్కర్నూల్ : సమైక్య పాలనలో అస్తిత్వం కోల్పోయిన బతుకమ్మ పం డుగకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం గుర్తింపును తీసుకొచ్చింది. రాష్ట్రం వచ్చాక ప్రతి ఏడాది నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వమే అధికారికంగా పం డుగను నిర్వహిస్తున్నది. ముఖ్యంగా ఆడ పడుచులకు సర్కార్ కానుకగా చీరలను సైతం అందజేస్తున్నది. ప్రజలు పేదరికంతో పండుగకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో భాగంగా అటు క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, రంజాన్ పండుగకు ముస్లింలకు విందు భోజనాలతోపాటు దుస్తులను పంపిణీ చే స్తున్నది. ఈ క్రమంలో బతుకమ్మ పండుగ లో భాగంగా 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరలను అందజేస్తున్నది. రేషన్ కా ర్డుల్లో పేర్లు ఉన్న అర్హులైన మహిళలందరికీ అందమైన చీరలను అందజేస్తుండడం వి శేషం. పరోక్షంగా చేనేత కార్మికులు చీరల తయారీతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నా రు. ఏడాదికేడాది గతంలోకంటే విభిన్న రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో తయారు చేస్తుండడం గమనార్హం. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆయా జిల్లాలకు చీరలు చేరుకున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాకు చేరిన చీరలు ఆరు రంగులు, పలు డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే 70 శాతం వరకు చేరిన ఈ చీరలను నియోజకవర్గ కేంద్రాల్లోని గోదాంలలో భద్రపరిచారు. మిగిలిన చీరలు కూడా వారంలోగా రానున్నాయి. త్వరలోనే చీరలను రేషన్ దుకాణాల ద్వారా మహిళలకు అందించనున్నారు. అక్టోబర్ 6న బుధవారం నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 14న గురువారం నవమి రోజున ముగుస్తుంది. 15వ తేదీన విజయదశమి పండుగ నిర్వహించుకోనునారు. జిల్లాకు చేరిన చీరలను వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు. చీరల పంపిణీకి సివిల్ సైప్లె అధికారులు చర్యలు చేపట్టారు. 2,94,890 మందిని అర్హులుగా గుర్తించగా.. ఇప్పటి వరకు 1,89,480 మందికి సరిపోయే చీరలు వచ్చాయి. మిగిలిన చీరలు వారంలోగా జిల్లాకు చేరనున్నాయి.
సమన్వయంతో పంపిణీకి యత్నం..
బతుకమ్మ చీరలను పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించా రు. ప్రధానంగా పౌరసరఫరాల శాఖ, రేష న్ డీలర్, సెర్ఫ్, మెప్మా, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖ సిబ్బంది, మహి ళా సంఘాల సభ్యుల సహకారంతో పం పిణీ చేయనున్నారు. రేషన్కార్డులో పేరు నమోదు ఉంటేనే ఆధార్కార్డు నిర్ధారణతో చీరలను పంపిణీ చేయనున్నారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణాభివృద్ధి,చేనేత జౌళి శాఖలు, రెవెన్యూ డివిజన్
స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో ఎం పీడీవో, తాసిల్దార్, గ్రామ స్థాయిలో పలు శాఖల సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. మున్సిపాలిటీల్లో కమిషన ర్లు, మెప్మా అధికారులు, ఉద్యోగులు, సి బ్బంది, రీసోర్స్ పర్సన్లను భాగస్వామ్యం చేయనున్నారు. రేషన్ దుకాణాల వారీగా బాధ్యులైన అధికారులు, ఉద్యోగుల కేటాయింపు, సూపర్వైజర్ల నియామకం తదితర కసరత్తులు చేస్తున్నారు.
చీరల పంపిణీకి ఏర్పాట్లు..
బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లాలో 2.94 లక్షల మంది రేషన్కార్డు లబ్ధిదారులకు చీరలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాకు ఇప్పటి వరకు 70 శాతం చీరలు చేరాయి. ఆరు రంగుల్లో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలోని 558 రేషన్ దుకాణాల ద్వారా వచ్చే నెల మొదటి వారంలో చీరల పంపిణీ చేపడుతాం. ప్రస్తుతం చేరిన చీరలను గోదాంలో భద్రపరిచాం.