కోస్గి, జూలై 25 : ఉపాధ్యాయుడే చరిత్ర నిర్మాత.. వి ద్యార్థి భవిష్యత్ నాలుగు గోడల మధ్య తరగతి గదిలో ఉపాధ్యాయుడి చేతిలో తీర్చిదిద్దబడాలనేది జగమెరిగిన సత్యం. కానీ మండలంలో విద్యావ్యవస్థ అందుకు భిన్నంగా ఉంది. సమాజానికి ఆదర్శంగా ఉండే ఉపాధ్యాయులే అవినీతికి పాల్పడుతూ విద్యావ్యవస్థకు మచ్చ తీసుకోస్తున్నారు. పాఠశాలలకు వెళ్లకుండా కొంతమంది ఉపాధ్యాయులు వేతనా లు పొందుతున్నారు. సమాజానికి మంచిపేరు తేవాల్సిన టీచర్లే చీడపురుగులుగా మారుతున్నారు. ఎంతో మంది ని రుద్యోగులున్న ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగముండి వేలకు వేలు వేతనాలు పొందుతూ పాఠశాలలకు వెళ్లకుండా త మ వ్యక్తిగత పనులు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
పాఠశాలలకు వెళ్లకుండానే వేతనాలు
మండలంలో 49 ప్రాథమిక, 3 ప్రాథమికోన్నత, 13 ఉన్నత పాఠశాలలున్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలల్లో 144 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 25 మంది, ఉన్నత పాఠశాలల్లో 151 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కొందరు అసలు పాఠశాలకు వెళ్లకుం డా ఉన్నతాధికారులకు కాసులు ఎరజూపి వేతనాలు పొం దుతున్నారు. ఇదేమిటని అడిగితే వారు మెడికల్ సెలవుపై వెళ్లారని సాకులు చెబుతున్నారు. ఒక ఉపాధ్యాయుడికి ఏ డాదికి పరిమిత సంఖ్యలో మెడికల్ సెలవులుంటాయి. కా నీ ఏండ్ల తరబడి పాఠశాలకు రాకుండా ఉంటే మెడికల్ సెలవులు ఎక్కడ ఉంటాయో అర్థం కాని దుస్థితి. ఇలా అర్థంపర్థం లేని సాకులు చెబుతూ వేలకు వేలు వేతనాలు పొందుతున్నారు.
ఉపాధ్యాయులపై చర్యలేవీ..?
మండలంలో సుమారు ఇద్దరు ఉపాధ్యాయులు రెండు,మూడేండ్లుగా పాఠశాలకు వెళ్లకుండా వేతనాలు పొందుతున్నారు. వేతనాలు ఇవ్వకుండా ఆపాల్సిన మండల విద్యాధికారిని తనదైన శైలిలో బేరాలు చేసుకొని వేతనాలు చేస్తున్నట్లు పలువురు ఉపాధ్యాయులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మరో ఒకరిద్దరు ఉపాధ్యాయులు డిప్యుటేషన్ల పేరుతో ఆ పాఠశాల ఈ పాఠశాల అంటూ కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకుండా ఎమ్మార్సీ కార్యాలయ పని చెబుతూ విద్యార్థులను మోసం చేస్తున్నాడు. ఎప్పుడు చూసిన ఎమ్మార్సీ కార్యాలయంలోనే కూర్చొని బిల్లులు చేస్తానంటున్నాడు. ఉపాధ్యాయుల బిల్లులు చేయాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లు ఏమయ్యారో అర్థం కానీ దుస్థితి. ఏదీఏమైనా ఉపాధ్యాయ వృత్తిలో ఇలాంటి చీడపురుగులను ఏరి వేయాలని, విద్యావ్యవస్థపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
నిష్టా ట్రేనింగ్ డబ్బులు స్వాహానా..?
ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు నిష్టా పేరుతో ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహించింది. గత విద్యాసంవత్సరం 2019 డిసెంబర్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం రూ.6లక్షలు మంజూరు చేసింది. కానీ నేటికీ ఆ డబ్బులు జిల్లా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులకు అందలేదు. ఈ విషయమై డీఈవో లియాఖత్ అలీని వివరణ కోరగా.. ఈ వ్యవహారాలు నా దృష్టికి రాలేదని, మండల అధికారులచే నివేదికలు తీసుకుని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.