ఊట్కూర్, సెప్టెంబర్ 11 : వినాయక చవితి ఉత్సవాల ను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో వి నాయకుల విగ్రహ ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండలకేంద్రంలోని ప్రధాన కూడళ్లలో రంగు రంగుల తోరణాలతో తయారు చేసిన మండపాల్లో వినాయకులను ప్రతిష్ఠించారు. శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, మండపాల నిర్వాహకులు పాల్గొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
విగ్రహాన్ని కొనిచ్చిన ముస్లిం యువకులు
మండలంలోని బీసీ కాలనీలో కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ తాజొద్దీన్ వినాయక విగ్రహాన్ని కొనిచ్చారు. అంతేకాకుండా ముస్లిం యువకులు శనివారం ఇక్కడ ప్రత్యేక పూజ చేశారు. అదేవిధంగా ధన్వాడ కంచుకోట వీధిలో హిందూ, ముస్లిం యువకులు కలిసి ప్రత్యేకం గా వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు. రాం రహీమ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వినాయడిని ప్రతిష్ఠాపించి ప్రత్యేక పూ జలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో ముస్లిం యువకులు పా ల్గొనడంపై జబర్దస్త్ కమీడియన్లు అప్పరావు, రైజింగ్ రాజు సోషల్ మీడియా ద్వారా యువకులను అభినందించారు. అదేవిధంగా అందరు కలిసి ఉండాలని కోరారు.
ప్రత్యేక పూజలు
మరికల్, సెప్టెంబర్ 11 : మండలంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖారెడ్డి దంపతులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించాలని, శాంతియుతంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. ప్ర తి వినాయకుడి మండపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ఉత్సవాలను ఘనంగా చేపట్టాలన్నారు.
వాడవాడలా గణనాథులు
కోస్గి, సెప్టెంబర్ 11 : వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణపతులను ప్రతిష్ఠించారు. మండలంలో 145 మండపాల్లో గణనాథులను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించనున్నారు. శనివారం స్థానిక శివాజీ చౌరస్తాలో హిందువాహిని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మున్నూర్వాడలో ప్రతిష్ఠించి న గణనాథుడికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అన్నపూర్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజలందుకుంటున్న గణపతులు
మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ, కొల్లంపల్లి, అప్పక్పల్లి తదితర గ్రామాల్లో ఆలయాలు, ప్రత్యేక మండపాల్లో కొలువుదీరిన వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం ఆయా గ్రామాల్లో నిర్వాహకులు, భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో కూడా గణనాథులను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గణపయ్యకు ప్రత్యేక పూజలు
వినాయక నవరాత్రుల సందర్భం గా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద వినాయకుడి కి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుల మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులు భౌతిక దూ రం పాటిస్తూ, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి ప్రజాప్రతినిధులు, భక్తులు, కుటుంబ సభ్యులు గణపయ్యకు పూజ లు నిర్వహించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ…
మండలంలోని ఆయా గ్రామాల్లో 83 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. శనివారం భక్తులు, గ్రామస్తులు ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఆ యా యువజన సంఘాలు మండపాలను అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా భజనలు, కీర్తనాలు పాడడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. మండపాల వద్ద భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. రాత్రి సమయంలో మండపాల వద్ద ఇద్దరు నిద్రించేలా క మిటీ సభ్యులు శ్రద్ధ వహించాలన్నారు.
శివాలయంలో అన్నదానం
జిల్లా కేంద్రంలో ని నారాయణస్వామి శివాలయంలో శనివారం అన్నదానం నిర్వహించారు. అంతకుముందు గణనాథుడికి ప్రత్యేక పూ జలు చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు డి.సంతోష్, శివకుమార్శారి, నందుశారి, డి.సంపత్, శివకుమార్, శ్రీ ధర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
శివసేన యూత్ ఆధ్వర్యంలో…
శివసేన యూత్ ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని యూత్ సభ్యు లు తెలిపారు. పట్టణంలోని అనంపల్లి వీధిలో శివసేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. ప్రతిరోజు అన్నదానం నిర్వహి స్తామని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కమిటీ అధ్యక్షుడు రాము, యూత్ సభ్యులు పాల్గొన్నారు.