ఊట్కూర్, అక్టోబర్ 18 : రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జనరల్బా డీ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రైతు సంక్షేమం కో సం ఏ ప్రభుత్వం కూడా చేపట్టని సంక్షేమ పథకాలను ప్ర భుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. రైతులు లాభనష్టాలను బేరీజు వేసుకొని తమకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని.. ప్రభుత్వం రైతాంగానికి పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ప్రజల దీవెనతో గెలుపొందిన సర్పంచులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ గ్రామాలను ప్రగతి పథంలోకి తేవాలన్నారు. తనది ముక్కుసూటి తనం తప్ప ఎవరికీ న ష్టం చూకూర్చలేదన్నారు. గ్రామాల్లో సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గా నియోజకవర్గంలో తన హయాం లో దాదాపు 3వేల ఎకరాల ప్రభుత్వం భూములను దళితులు, పేదలకు పట్టాలను అందజేశామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల నుంచి అ ధికారులు లంచం ఆశిస్తున్నట్లు తెలుస్తున్నదని..ఇకపై తనే నేరుగా ఫోన్ చేసి తెలుసుకుంటానని, పద్ధ్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.
సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు అం దజేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. సర్పంచుల విన్న పం మేరకు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యాచరణలో భా గంగా అన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డు లు, ప్రకృతి వనాలకు విద్యుత్ సరఫరా చేపట్టాలని ఎలక్ట్రిసిటీ ఏఈ వెంకటేశ్ను ఆదేశించారు. మిషన్భగీరథ పైప్లై న్ లీకేజీలను మరమ్మతులు చేపట్టకపోవడంతో తాగు నీరు కలుషితమవున్నా ఆర్డబ్లూఎస్ ఏఈ వెంకటేశ్ పట్టించుకోవడం లేదని పలు గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసురాగా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అన్ని వసతులను కల్పించామని, ప్రసవాల సంఖ్య పెరిగిందని పీహెచ్సీ వైద్యులు శ్రీకాంత్రెడ్డి, నరేశ్చంద్ర తెలిపారు.
ఆత్మ విమర్శ చేసుకోవాలి
ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవే శ పెట్టిన ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఆత్మ విమర్శ చే సుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. సమావేశంలో వీ ఏఎస్ మహదేవ్ గొర్రెల పంపిణీ కార్యక్రమంపై చదివి వినిపిస్తుండగా బీజేపీ ఎంపీటీసీ హన్మంతు అడ్డుతగలడంతో ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. పథకంపై పూర్తి అవగాహనతో మాట్లాడాలి తప్ప ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, ఎంపీడీవో కాళప్ప, డిప్యూటీ తాసిల్దార్ రాజగణేశ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, మండల అ ధ్యక్షుడు రవిప్రసాద్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.