దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 24 : రైతు లు తమ కాళ్ల మీద నిలబడేలా భరోసా క ల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని జీనుగరాల గ్రామ చెరువు లో 1.20 లక్షల చేపపిల్లలు విడుదల చేశా రు. డోకూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి కమ్యూనిటీ భవనం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై డప్పుమేళాలతో ఎమ్మెల్యే ను ఊరేగించారు. అనంతరం చింతకుంట గ్రామానికి చెందిన అన్నదాతకు రైతుబీమా ద్వారా వచ్చిన రూ.5 లక్షల చెక్కును నామినీకి అందజేశారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు రూ .36.04 లక్షల విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు పం పిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంలో తాగు, సాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని, కేసీఆర్ సార్ పాలనలో ఎండాకాలం సైతం పచ్చని పొలాలు కనబడుతున్నాయన్నా రు. వలసలు వెళ్లిన వారు స్వగ్రామాలకు తిరిగి వస్తున్న ట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అందు లో భాగంగా కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచి ఏడాదిపాటు నీరు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తునట్లు తెలిపారు. రైతులు ప్రతి వారానికి ఒక సారి రైతు వేదికలో సమావేశమై దేశ విదేశాల్లో అనుసరిస్తున్న నూతన వ్యవసాయ సాంకేతిక ప ద్ధతులను తెలుసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జె డ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ఎంపీపీ సుజాత, సర్పంచ్ రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ల్ నరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుగుణ, ఎంపీటీసీ యజ్ఞభూపాల్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, సీఐ రజిత, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.