హన్వాడ, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో నీటిని ఒడిసిపట్టాలనే ఉద్ధేశంతో వాగులపై చెక్డ్యాంలను నిర్మిస్తున్నది. దీంతో గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగి బోర్లు రీచార్జి అవుతున్నాయి. మండలంలోని వేపూర్, లింగన్నపల్లి గ్రామాల మధ్య వాగుపై చెక్డ్యాం నిర్మాణానికి ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో ప్రభుత్వం నుంచి రూ. 3కోట్ల 46లక్షల 50వేలు మంజూరు చేయించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ పనులకు శంకుస్థాపన చేశారు. నెలరోజులుగా చెక్డ్యాం నిర్మాణపనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. వర్షాలు కురుస్తున్నందున నిర్మాణ పనులపై మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. చెక్డ్యాం నిర్మాణంతో వేపూర్, గొండ్యాల, లింగన్నపల్లి గ్రామాలతోపాటు చుట్టుపక్కల తండాల్లో నీటిఎద్దడి తీరనున్నది. దీంతో వందలాది బోరుబావుల్లో నీటిమట్టం పెరుగనున్నది. చెక్డ్యాం చుట్టుపక్కల వ్యవసాయ భూమి ఉన్న 70నుంచి 100కుటుంబాలకు జీవనోపాధి కలుగుతున్నది. మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకముందే పనులు పూర్తి కావస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్డ్యాం నిర్మాణం పూర్తయిన తరువాత డ్యాంలో రెండు కిలోమీటర్ల వరకు నీళ్లు నిల్వ ఉంటాయి.
సంతోషంగా ఉంది
వాగుపై చెక్డ్యాం నిర్మించడంతో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండదు. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పనులు కూడా త్వరగా పూర్తవుతున్నాయి. నాకు వాగు పక్కన భూమి ఉంది. చెక్డ్యాంలో నీళ్లు ఉంటే బోరులో పుష్కలంగా నీళ్లొస్తాయి. – సంగప్ప, రైతు, వేపూర్
పనులు వేగంగా జరుగుతున్నాయి
మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో పనులు వేగంగా చేస్తున్నారు. కోట్ల రూపాయలతో చెక్డ్యాం నిర్మించడంతో ప్రభుత్వానికి రుణాపడి ఉంటాం. చుట్టుపక్కల వందలాంది బోరుబావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. – యాదయ్య, వేపూర్