మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 19 : పండుగలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మంత్రి పాల్గొ ని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కులమతాలకతీతంగా మహబూబ్నగర్ ప్రజలు కలిసి ఉంటారన్నారు. ప్రవక్త చూపిన మార్గం అనుసరించాలని, ఆయన జీవితం ప్రపంచ మానవాళికి ఆదర్శం కా వాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అ నంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ను ము స్లింలు సన్మానించారు.
ముస్లింల భారీ ర్యాలీ..
మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం లు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించా రు. జిల్లా కేంద్రంలోని ప్రతి మసీదు, మదరసాల నుంచి పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ చే పట్టారు. అసర్ నమాజ్ అనంతరం సా యంత్రం 5 గంటలకు మక్కా మసీద్ నుం చి మిలాద్ జులూస్ ప్రారంభమై క్లాక్టవర్ మీదుగా మున్సిపాలిటీ, అశోక్ టాకీస్ చౌ రస్తా, అంబేద్కర్ చౌరస్తా చేరుకున్నారు. అ క్కడ ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వాగతం పలికారు. ర్యాలీలో చిన్నారులు సైతం ఖురాన్ సూక్తులను, గీతాలను ఆలపించారు. ర్యాలీ అనంతరం షాషాబ్గుట్ట దర్గా ఆవరణలో నిర్వహించిన ధా ర్మిక సభలో జామియ నిజామియా యూ నివర్సిటీ ప్రొఫెసర్ సఘీర్ అహ్మద్ నక్షబంది ధార్మిక సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో మర్కజీ వర్కింగ్ ప్రెసిడెంట్ స య్యద్ అఫ్రోజ్ షా ఖాద్రీ, కమిటీ చీఫ్ ప్యాట్రన్ సయ్యద్ అబ్దుల్ రజాక్షా ఖాద్రీ, అధ్యక్షుడు మజహర్హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, నాయకులు అబ్దుల్హాదీ, అన్వర్పాషా, జాకీర్, మోసీన్ఖాన్, ఒబేదుల్లా కొత్వాల్, షబ్బీర్ అహ్మ ద్, జావిద్బేగ్, జహంగీర్, సాదుతుల్లా హుస్సేనీ, మహ్మద్ సాదుల్లా, సయ్యద్ జఫర్షా, జహంగీర్ పాషా ఖాద్రీ, కుతుబుద్దీన్, మీర్షోయబ్అలీ, తాహెర్, ముంజిమిల్, ఇబ్రహీం, అంజద్, అజ్మత్అలీ, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.
కరాటే టోర్నీ బ్రోచర్ ఆవిష్కరణ
నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వేదికగా నిర్వహించనున్న ఆన్లైన్ అంతర్జాతీయ కరాటే టోర్నీ బ్రోచర్ను మంగళవారం జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. కేశవ్ అకాడమీ నిర్వాహకులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, వినయ్, గాయిత్రి పాల్గొన్నారు.