మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 27: తన జీవితం దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అ బ్దుల్ కలాం అని ఎక్సైజ్శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం దివంగత రాష్ట్రపతి అబ్దుల్కలాం వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యూటౌన్లో కలాం విగ్రహానికి పూలమాల వేసి మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల ని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు కట్టా రవికిషన్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, రాము తదితర కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సేవలు అభినందనీయం
ఆర్టీసీ ఉద్యోగుల సేవలు అభినందనీయమని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్ప ష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవర్ల శిక్ష ణ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చేయాల్సి ఉంటుందో అంతకుమించి చేస్తున్నదన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. అనంతరం రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రేషన్కార్డులను మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవి, సూర్యనారాయణ, డీఎం అశోక్రాజు, శ్రీనివాస్గౌడ్, జీఎల్ గౌడ్, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటానికీ క్షీరాభిషేకం
గిరిజన విద్యార్థి వసతి గృహాన్ని తెరిపించినందుకుగానూ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటానికి జీవీఎస్ సంఘం నాయకులు, విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న వసతిగృహంలో మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రవీందర్నాయక్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్గౌడ్కు విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపడంతో వసతిగృహాన్ని ప్రారంభించి విద్యార్థులకు మేలు చేశారన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.