మహబూబ్నగర్, జూలై 20: అభివృద్ధి జరుగాలంటే అందుకు సంబంధించిన భూసేకరణ కూడా వేగవంతం చే యాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నా రు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్లో సమావేశం హాల్లో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. ఎత్తిపోతల పథకాలు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల కింద ఫైనల్ డిక్లరేషన్ చే యాల్సిన వాటికి 3డీ ఇవ్వాలని, ఎక్కడైనా సమస్యలు ఉం టే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాతీయ ర హదారికి ఇరువైపులా గతేడాది హరితహారం కింద మొక్క లు నాటామని, మొక్కల మధ్య ఖాళీలు ఉన్న చోట గుర్తిం చి తక్షణమే మొక్కలు నాటి పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలానికి ఒక అధికారిని కేటాయించి మొక్కలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే పనులకు సంబంధించి ఎక్కడైనా ఇంకా పెండింగ్ పనులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, కొత్తగా ఏర్పాటు చేసి న అలైన్మెంట్ ప్రకారం డీఎం డీడీ ఇవ్వాలని, ఎక్కడైనా అండర్ పాస్ చేయాల్సి ఉంటే వెంటనే చేయాలని అధికా రులను ఆదేశించారు.
త్వరలోనే కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం
త్వరలో నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించనున్నామని, అధికారులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం తన చాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా లాన్పనులు, చిన్న చిన్న మార్పు లు, చేర్పులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. పార్కింగ్ ప్రహరీ చుట్టూ మొక్కలు నాటడం వం టి పనులు, ఆయా సమావేశ మందిరాల గదులు, విద్యుత్ తదితర పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‘ధరణి’ సమస్యలు పరిష్కరించాలి
ధరణి ద్వారా వచ్చిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా మండల అధికారులతో సమీక్షించారు. ధరణిలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, మధ్యాహ్న సమయం లో నెట్వర్క్ సమస్య వల్ల ఇబ్బందులు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. భూములను అమ్మేవారు, కొనేవా రు ఉదయం సమయంలోనే లావాదేవీలు పూర్తి చేసుకునే లా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. తాసిల్దార్లు ధరణిని బాగా నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లతో దాదాపు 99.9శాతం కేసులన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ధరణిలో ఎక్కడైనా పెండింగ్లో ఉన్నట్లయితే వెం టనే పూర్తిచేయాలని కోరారు.
మీ సేవ ఆపరేటర్లు ధరణికి సంబంధించి ప్రజలకు ఇ బ్బందులకు గురి చేయొద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింగం, ఈఈ స్వామి, డీఈ సంధ్య, ఏవో ప్రేమ్రాజ్, ఆర్డీవో పద్మ, తాసిల్దార్లు, ఆయా ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.