జడ్చర్ల, జూలై 19: భావితరాల భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జడ్చర్లలోని బాదేపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పల్లె, పట్టణప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా మారాయన్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వెళ్లే ప్రధాన రహదారి నాలుగులైన్లు విస్తరించిందని, సిగ్నల్గడ్డపై ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద 500 మీటర్ల పొడవునా రోడ్డు మిగిలిందన్నారు. త్వరలోనే బ్రిడ్జితోపాటు అప్రోచ్రోడ్డును నిర్మిస్తామని, ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయన్నారు. మండల పరిషత్ కార్యాలయ వెనుకభాగంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు స్థలం సేకరిస్తున్నామన్నారు. టీటీడీకల్యాణ మండపానికి కేటాయించిన స్థలంలో లూస్ సాయిల్ ఉండడం వల్ల నిర్మాణానికి అనుకూలంగా లేదన్నారు.
జడ్చర్లలో ట్రాఫిక్, రూరల్ పోలీస్స్టేషన్, డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరినట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతరం అక్షయపాత్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారం కిట్లు అందజేశారు. అదేవిధంగా చైర్పర్సన్తోపాటు కౌన్సిలర్లను శాలువాతో సన్మానించారు. మండలంలోని గంగాపూర్ వద్ద రూ.8లక్షలతో నిర్మించిన ఈద్గాను ప్రారంభించారు. కార్యక్రమంలో సంగీతనాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఎంఈవో మంజూలాదేవి, వైస్ చైర్పర్సన్ సారిక, మాజీ వైస్ ఎంపీపీ గోవర్దన్రెడ్డి, మాజీ చైర్మన్ మురళి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, సతీశ్, లత, మహేశ్, చైతన్య, పుష్పలత, బృందం గోపాల్, కొండల్, రామ్మోహన్, శంకర్నాయక్, ఇమ్మూ, నర్సింహులు, వెంకటేశ్గౌడ్, భీంరాజ్, పర్మటయ్య, తదితరులు పాల్గొన్నారు.