నారాయణపేట, జూలై 20 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. భక్తులు ఉద యం నుంచి ఉపవాసాలు నిర్వహించారు. పట్టణంలోని పాండురంగస్వామి, సత్యనారాయణస్వామి, బాలాజీ ఆలయాల్లో అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆయా ఆలయాల్లో మహిళలు, భక్తులు స్వామి వారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
మండలంలోని వివిధ గ్రామా ల్లో ఆలయాల్లో ఆషాఢ మాసం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాతన్పల్లి వీరభద్రేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక నిర్వహించి తీర్థ ప్రసాదాల వి తరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ పురోహితులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో…
మండలంలోని ఆయా గ్రామాల్లో తొ లి ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నా రు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప లు ఆలయాల్లో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మండలంలోని గు డెబల్లూర్లో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకుడు వెం కోబాచారి ఆధ్వర్యంలో నిర్వహించా రు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమం లో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆలయాలను దర్శించుకున్న భక్తలు
మండల వ్యాప్తంగా ప్రజలు మంగళవారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సం ఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. ఊట్కూర్, నిడుగుర్తి, తిప్రాస్పల్లి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, బిజ్వారం, పులిమామిడి తదితర గ్రామాల్లో భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజ లు, కుంకుమార్చన నిర్వహించారు. పలువురు భక్తులు ఉ పావాస దీక్షలు కొనసాగించారు. ఆలయాల్లో సామూహిక భజనలు, భక్తి కీర్తనలను ఆలపించారు.
స్వామివారికి పంచామృతాభిషేకం
మండలంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పస్పులలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషే కం చేశారు. పంచదేవ్పహాడ్లో శ్రీపాదఛాయ ఆశ్రమ పీఠాధిపతి శ్రీపతిస్వామీజీ ఆధ్వర్యంలో అఖండ దిగంబర య జ్ఞం నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరిలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించారు.
నారాయణపేట మండలంలో…
మండలంలోని వివిధ గ్రామాల్లో తొలి ఏకాదశిని పురస్కరించకొని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాజాపూర్లో విఠోబ మందిరంలో స్వామివారికి పూజలు చేశారు. క్షత్రీయ సమాజం ఆధ్వర్యంలో పల్లకీ సేవ నిర్వహించి గ్రామంలో ఊరేగింపు చేపట్టారు.