మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 24: ప్రతి సీజన్లో వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని ఆత్మ పీడీ హుక్యానాయక్ రైతులకు సూచించారు. అడ్డాకుల, కందూరు రైతువేదికల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ పీడీతోపాటు, శాస్త్రవేత్త రామకృష్ణ మాట్లాడుతూ రైతులు పంటమార్పిడి చేయడం వల్ల కలిగే లాభాలను వివరించడంతోపాటు, వారికి ఎలాంటి పంటలు సాగుచేయాలని, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. యాసింగిలో ఎక్కువ శాతం కూరగాయాలు, ఇతర పంటలనే సాగుచేయాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఏవో శ్రీనివాసులు, ఎంపీటీసీ రంగన్నగౌడ్, సర్పంచ్ కిషన్నాయక్, ఆంజనేయులు, నాయకులు విజయ్మోహన్రెడ్డి, భీమన్నయాదవ్, రమేశ్, సుధాకర్రెడ్డి, గోవిందరెడ్డి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
పోల్కంపల్లిలో..
మూసాపేట మండలంలోని పోల్కంపల్లి రైతువేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మపీడీ హుక్యానాయక్ రైతులకు పంటమార్పిడిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో రాజేందర్రెడ్డి, రైతులు రవీందర్రెడ్డి, సులోచన తదితరులు పాల్గొన్నారు.
వరిసాగు చేయొద్దు
యాసంగిలో రైతులు వరిసాగు చేయొద్దని ఏవో కిరణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో యాసంగిలో వరి సాగు చేయకుండా పంటలమార్పిడిపై రైతులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్రాజ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచ్ రేవతి, ఉపసర్పంచ్ గంగాపురి, నాయకులు లక్ష్మయ్య, రమణారెడ్డి, సాయిలు, బసిరెడ్డి, సత్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పంటమార్పిడిపై అవగాహన
మిడ్జిల్, సెప్టెంబర్ 24: వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించాలంటే పంటమార్పిడి చేయాలని రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్యామల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు కొత్తూర్లో రైతువేదిక వద్ద రైతులకు పంటమార్పిడిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈలు సాయికృష్ణ, మయూరి, నాయకులు ప్రతాప్రెడ్డి, డానియేలు, బాలస్వామి, కరుణాకర్రెడ్డి, జనార్దన్, మల్లయ్య, రవిగౌడ్, కృష్ణారెడ్డి, వెంకటయ్య, గణేశ్ పాల్గొన్నారు.
వాణిజ్య పంటలను సాగు చేయాలి
యాసంగిలో రైతులు ఆరుతడి, వాణిజ్య పంటలను సాగు చేయాలని ఏడీఏ అనిల్కుమార్ సూచించారు. మండలంలోని హన్మసానిపల్లి, సిద్దోటంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటల సాగుపై శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ అనిల్కుమార్ మాట్లాడారు. వరికి ప్రత్యామ్నాయ పంటలైన శనగ, వేరుశనగ, నువ్వులు, కుసుమ, ఆముదాలు, కూరగాయలు వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవో కృష్ణకిశోర్, శాస్త్రవేత్త అర్చన, ఏఈవోలు తేజశ్విని, గౌతమి, శ్వేత, స్వప్నిక, నరేశ్, అజయ్, శశిత పాల్గొన్నారు.
ఆయిల్పాం తోటలతో లాభాలు
వరి పంటకంటే ఆయిల్ పాం తోటలతో అధిక లాభాలు సాధించవచ్చని సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, హార్టికల్చర్ ఏడీ మహేందర్ సూచించారు. అడ్డాకుల సింగిల్విండో కార్యాలయంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సీఈవో వెంకటయ్యగౌడ్, డైరెక్టర్లు కృష్ణయ్య, రాజు, రాజేశ్వర్రెడ్డి, నర్సింహారెడ్డి, మణెమ్మ, సంజీవరెడ్డి ఉన్నారు.