మక్తల్ రూరల్, జూలై 16 : నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని నర్సిరెడ్డి పల్లెలో హరితహారంలో భాగం గా ఆయన మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి మొక్కలను నా టుతున్నా, వాటిని పట్టించుకోకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిఒక్కరూ ఆరు మొక్కలు నా టి వాటిని సంరక్షించాలన్నారు. అలాగే మున్సిపాలిటీలోని నా రాయణపేట క్రాస్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని, ఎంపీటీసీ బలరాంరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి
కృష్ణ, జూలై 16 : పర్యావరణ పరిరక్షణ, అడువుల పెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మాగనూర్ మండలంలో మెగా ప్లాంటేషన్ ఆ ధ్వర్యంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటి కీ వెళ్లి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. అలాగే పల్లె ప్రకృతి వ నాన్ని సందర్శించారు. గ్రామంలో వీధి రోడ్లు, మురుగు కాల్వలను పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామ ల, జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచు లు, నాయకులు పాల్గొన్నారు.
గ్రామాలన్నీ పచ్చని తోరణాలుగా మారాలి
కోస్గి, జూలై 16 : ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగం గా గ్రామాలన్నీ పచ్చని తోరణాలుగా మొక్కలతో అల్లుకోవాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని ఆరవ వార్డులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటి ఎదుట ఆరు మొక్కలు ఉండే లా అధికారులు, కౌన్సిలర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. అందరూ కలిసి ఆకుపచ్చని ఆదర్శ మున్సిపాలిటీని తయారు చే యాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మ న్ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, ము న్సిపల్ చైర్పర్సన్ శిరీష, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మెగా ప్లాంటేషన్ ఆధ్వర్యంలో…
దామరగిద్ద, జూలై 16 : మం డలంలోని అంబాభవాని ఆలయ ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ ఆ ధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీవో రామన్న మా ట్లాడుతూ మండలంలో 400 మొ క్కలతోపాటు అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 12,600 మొక్కలు నాటమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆశమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజయ్యగౌడ్, సీనియర్ అసిస్టెంట్ వెంకట్రాములు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, జూలై 16 : మండలంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని జెడ్పీటీసీ విమల ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతిఒక్క రూ ఇంటి వద్ద మొక్కలు నాటించాలని జెడ్పీటీసీ కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, ఉపసర్పంచ్ అలీ, కార్యదర్శి పుస్పలత, ఏపీవో సిద్ధేశ్వర్, బీట్ ఆఫీసర్ విజయ్కుమార్ తదితరులు పాల్గ్గొన్నారు.
బాధ్యతగా మొక్కలు నాటాలి
ఊట్కూర్, జులై 16 : ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ప్లాంటేషన్ కార్యాక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని భాగస్వాములు కావాలన్నారు. మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లే ప్రధాన రోడ్డుకు రెండు వైపులా మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు.
మూడు వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ వివరించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, ఎంపీడీవో కాళప్ప, తాసిల్దార్ తిరుపతయ్య, ఎస్సై రవి, ఏఎస్సై సురేందర్, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, ఎంపీవో రవికుమార్, కార్యదర్శి జాన్, ఏవో సురేశ్రెడ్డి, ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారు లు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
నారాయణపేట రూరల్, జూలై 16 : ప్రతిఒక్కరూ ఆరు మొ క్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మం డలంలోని కొల్లంపల్లి గ్రామ శివారులో పేట-హైదరాబాద్ ప్ర ధాన రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వా టిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ సాయిరెడ్డి, ఎంపీటీసీ దామోదర్రెడ్డి, ఫారెస్ట్ అధికారి, ఎంపీడీవో పాల్గ్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
నారాయణపేట టౌన్, జూలై 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణంలోని 7వ వార్డు లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మున్సిపల్ కమిషనర్ భాస్కర్రెడ్డి, ప్రత్యేక అధికారి జైపాల్రెడ్డి, డీఆర్డీవో గోపాల్నాయక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి నారాయణరావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకు లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.