మున్సిపల్ శాఖ కమిషనర్,డైరెక్టర్ సత్యనారాయణ
పట్టణ ప్రగతిలో పరిశుభ్రతకు ప్రాధాన్యత
ఎమ్మెల్యే అబ్రహం
అయిజ, జూలై 7 : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పట్టణం నందనవనం కావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అయిజ మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి సీడీఎంఏ పరిశీలించారు. ఈ సందర్భంగా సీడీఎంఏ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నాటిన మొక్కలతో పచ్చదనంతో పరవశించి పోవాలన్నారు. ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ల సహకారంతో అయిజ మున్సిపాలిటీలో చేపట్టిన ప్లాంటేషన్ బాగుందన్నారు. రాష్ట్రంలోని పట్టణాల ప్రగతికి సీఎం కేసీఆర్ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సీడీఎంఏ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చిన్న దేవన్న, కమిషనర్ వేణుగోపాల్, ఏఈ గోపాల్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ
మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. బుధవారం అయిజ మండలంలోని పులికల్ గ్రామంలో ఏడో విడుత హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గోవర్దనమ్మతో కలిసి మొక్కలు నాటారు.
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట
వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పులికల్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు పెస్టిసైడ్స్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రూపేందర్ సింగ్, ఎంపీడీవో సాయిప్రకాశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, కోఆప్సన్ సభ్యుడు చాంద్నాయక్, డైరెక్టర్లు హనుమన్న, హుస్సేని, మాజీ జెడ్పీటీసీ చిన్న హన్మంతు, మాజీ ఎంపీపీ ప్రకాశ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జయంతి బాబురావు, కిశోర్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి
వడ్డేపల్లి, జూలై 7: మున్సిపాలిటీ అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చిన రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణను అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అబ్రహం, చైర్పర్సన్ కరుణ కోరారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను డైరెక్టర్ సత్యనారాయణ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. కార్యక్రమంలో కమిషనర్ పల్లారావు, కౌన్సిలర్లు ఆంజనేయులు, ధనలక్ష్మి, మాణిక్యం రవి , రామకృష్ణ రెడ్డి, దేవేంద్ర, డీలర్ శ్రీను పాల్గొన్నారు.