ఊట్కూర్, సెప్టెంబర్ 26 : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎ వరి స్థాయిలో వారు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం లో ఆదివారం ఊట్కూర్ మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యత పాటిస్తూ పార్టీలో పదవులను కట్టబెట్టామని, పని చేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నూతనంగా మూడోసారి ఎన్నికైన పార్టీ మం డల అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ లక్ష్మారెడ్డి, ప్రధానకార్యదర్శిగా శివరామరాజు, అనుబంధ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే పార్టీ కండువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మండల కోఆప్షన్ స భ్యుడు అబ్దుల్హ్రిమాన్, నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 26 : విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగినప్పుడు లక్ష్యసాధన సాధ్యమవుతున్నదని, అదేవిధంగా కార్యకర్తలు పార్టీకి మూలస్తం భం లాంటి వారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే ని వాసంలో మున్సిపాలిటీలోని 2వ వార్డు టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన శాంతిరెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. అదేవిధంగా టీఆర్ఎస్ అర్బన్ ఉపాధ్యక్షుడు దండు వెంకట్రెడ్డి కుమారుడు ఐసీఐసీఐ బ్యాంకులో ఉ ద్యోగం సంపాదించిన రఘువరన్ను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఎదుగుదలకు కా ర్యకర్తలే కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉ న్నత శిఖరాలు అధిరోహించినప్పుడే తండ్రికి అనందం అని ఎ మ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.