జడ్చర్ల, జూలై 16 : ప్రతిఒక్కరూ మొక్క లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా పరిషత్ వైస్చైర్మన్ యాదయ్య అన్నా రు. జడ్చర్ల మండలం లింగంపేట గ్రామశివారులోని ఈద్గాగుట్టపై శుక్రవారం సర్పం చ్ హైమావతీవెంకట్రెడ్డితో కలిసి విత్తనబంతులు చల్లారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కల చొప్పున నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి, ఏఈవో రమేశ్రెడ్డి, రాములు, బాలు, అంజమ్మ, వెంకటమ్మ, సీసీ స్వర్ణ, రమేశ్, ప్రేమలత, నర్సమ్మ, జం గమ్మ, భాగ్యమ్మ, యాదమ్మ పాల్గొన్నారు.
ఉద్యమంలా హరితయాత్ర
ఉ ద్యమంలా హరితయాత్ర కొనసాగుతున్నదని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నా రు. మండలంలోని కాటవరం గ్రామంలో విత్తనబంతులు చల్లారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, ఎంఈవో నాగయ్య, ఏపీఎం సుధీర్, సర్పంచ్ భాగ్యలక్ష్మీరాజునాయక్, ఉపసర్పంచ్ శ్రీనివాసులుగౌడ్, ఎం పీటీసీ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ సంరక్షించాలి
హరితహారం లో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సర్పంచ్ రజితారవీందర్రెడ్డి కోరారు. శుక్రవారం కోయిలకొండ మండలం అంకిళ్ల స మీపంలోని గుట్టల్లో విత్తనబంతులు చల్లా రు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డి, ఏపీఎం సునీత, కార్యదర్శి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడాలి
హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని సర్పంచ్ ఖాజాహసిబుద్దీన్ అన్నారు. శుక్రవారం గ్రా మసమీపంలో విత్తనబంతులు చల్లారు. అ నంతరం గ్రామంలో శిథిలావస్థకు చేరిన ని ర్మాణాలను తొలగించారు. కార్యక్రమం లో ఎంపీటీసీ వెంకట్రాములు, కార్యదర్శి ప్రవళిక, వార్డుసభ్యుడు నవాజ్ ఉన్నారు.