మహబూబ్నగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువ లు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఉత్తర్వులు సైతం అందాయి. ఎనిమిదేండ్లుగా భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపయ్యాయి. రా ష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రాకతో పెద్ద ఎత్తున ఆయకట్టు అభివృద్ధి చెందింది. బీడు భూములు సాగు భూములుగా మారాయి. వ్యవసాయం లాభసాటిగా మారడంతో ఈ రంగంలోకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. భూములకు భారీగా డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సర్వత్రా ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు, విక్రయ అగ్రిమెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్, కుటుంబీకుల భాగపక్షాల రిజిస్ట్రేషన్ చార్జీలు, కుటుంబ, కుటుంబేతరుల మధ్య ఒప్పందాలు, గిఫ్ట్, జీపీఏ, వీలునామా, లీజు తదితర సేవల చార్జీలు పెరగనున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న 6 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి పెంచారు. వ్యవసాయ భూముల కనిష్ఠ మా ర్కెట్ విలువ ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ. 100 నుంచి రూ.200లకు పెంచారు. అపార్ట్మెంట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.1000 చేశారు. ఉమ్మడి జి ల్లాలో వ్యవసాయ భూములు, వ్యవసాయ భూముల కని ష్ఠ విలువను రూ.75,000 మేర పెంచారు. నాగర్కర్నూల్ జిల్లాలో కనిష్ఠంగా రూ. 50,000 ఉన్న భూమి విలువ ఇ ప్పుడు రూ.1,25,000 వేలకు చేరుకున్నది. నాగర్కర్నూల్ పట్టణంలో గరిష్ఠంగా రూ.96,80,000 ధర ఉండగా.. తాజాగా రూ.1,25,84,00కు పెరిగింది. జోగుళాంబ గ ద్వాల జిల్లాలో రూ.65,000గా ఉన్న భూమి విలువ ఇ ప్పుడు రూ.1.50లక్షలకు చేరుకున్నది. గద్వాల పట్టణంలో ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.2,03,28,00 ఉన్న ఎకరా భూమి ధర ఇప్పుడు రూ.2,64,26,500కు పెరిగింది.
స్థలాల ధరలు..
నారాయణపేటలో కనిష్ఠంగా గజం రూ.150 నుంచి రూ.200కు, గరిష్ఠంగా రూ.4 వేల నుంచి రూ.5,750కు పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో కనిష్ఠంగా రూ.300 నుంచి రూ.500కు, పాలమూరు పట్టణంలో గరిష్ఠంగా రూ.10,000 ఉన్న గజం ధర రూ.13 వేల వరకు పెంచారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో గరిష్ఠంగా గద్వాల పట్టణంలో రూ.7000 ఉన్న గజం ధర రూ.9250కు పెంచారు.
సర్వత్రా హర్షం..
నాగర్కర్నూల్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూముల ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్ర భుత్వం పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెరిగిన ధరల ప్రకారం భూముల క్రయవిక్రయాలు జరుగనున్నాయి. భూ ముల ధర జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీలో అ త్యధికంగా, కొల్లాపూర్ మున్సిపాలిటీలో తక్కువగా ఉండడం విశేషం. ఇంతకు ముందు ఇక్కడ గజం రూ.800 ఉండగా, ప్రస్తుతం ఏరియాను బట్టి గజం రూ.1250 నుంచి రూ.7వేల వరకు ఉంది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇటీవల విలీనమైన నాలు గు గ్రామాలు మినహాయిస్తే గజం రూ.1250 నుం చి రూ.5,750 వరకు ఉన్నది. మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ, నాగనూలులోని మెయిన్ రో డ్డులో గజం రూ.500 ఉండగా.. ఇప్పుడు రూ. 800, గ్రామాల్లో రూ.300 నుంచి రూ.500కు పెరిగింది. ఎండబెట్ల, భీమారం, దేశిటిక్యాలలో రూ. 250 నుంచి రూ.400కు చేరుకున్నది. అచ్చంపేట మున్సిపాలిటీలో గజం రూ.500 నుంచి ప్రారంభమై రూ.2250 వరకు ఉన్నది. కొల్లాపూర్లో గజం రూ.1250 నుంచి రూ.1750 వరకు ఉన్నది. కాగా, భవనాలకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు స్కేర్ ఫీట్కు రూ.1000 చొప్పున ఒకే ధర నిర్ణయించారు. వ్యవసాయ భూముల కనిష్ఠ విలువ ఎకరాకు రూ.75వేలుగా ఉండనున్నది. ఓపె న్ ప్లాట్ల కనిష్ట విలువ చదరపు గజానికి రూ.200 చొప్పున పెంచారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకు న్నా.. పెరిగిన ధరలే చెల్లించాల్సి ఉంటుంది. రి యల్టర్లలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
స్లాట్ ప్రకారం ధరలు..
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వారీగా ప్రభుత్వం వేర్వేరుగా ధరలు నిర్ణయించింది. వనపర్తి జిల్లా పరిధిలో ఎకరా వ్యవసాయ భూమికి రూ.75 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ. 1.25 లక్షలుగా నిర్ణయించారు. కమర్షియల్ భూముల విషయానికి వస్తే రూ.2 లక్షలుగా ధర కేటాయించారు. వనపర్తి మున్సిపాలిటీలో గజం రూ.1,000 నుంచి రూ.1500 పెంచారు. కమర్షియల్ విషయానికి వస్తే రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారు. పెబ్బేరు మున్సిపాలిటీలో గజం రూ.1,800 నుంచి రూ.2,250 పెంచారు. కర్నూల్ రోడ్ మార్గంలో ప్రస్తుతం గజానికి రూ.14 వేలు ఉండగా.. సడలించిన విలువ ప్రకారం రూ.18,350గా ఉన్నది. కొత్తకోట మున్సిపాలిటీలో గజం రూ.1,000 నుంచి రూ.1500కు పెంచారు. కమర్షియల్ విషయానికి వస్తే రూ.2 వేల నుంచి రూ.3 వేలు పెంచారు. గోపాల్పేట, చిన్నంబావి, వీపనగండ్ల వంటి మారుమూల ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల విలువను కనీస మొత్తంలో పెంచారు. పెరిగిన విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు విలువలో 7.5 శాతంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏరియాను అనుసరించి 20 నుంచి 60 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.