గద్వాల, జూలై 16 : ఆయిల్పాం సాగు అన్నదాతల పాలిట వరంగా మారనున్నది. నడిగడ్డ జిల్లా భూములు అనుకూలంగా ఉండడంతోపాటు ఆయిల్పాం సాగుపై ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయిల్పాం కమిటీ జిల్లాలో పర్యవేక్షించి భూములు అనుకూలంగా ఉన్నాయని చెప్పింది. సాగు దిశగా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకం పంటను సాగుచేసి రైతులు నష్టాల బారిన పడుతుండడంతో పంట మార్పిడి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నారు. ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఆయిల్పాం సాగు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఈ జిల్లాలను ఎంపిక చేశారు. ఆయిల్పాం సాగు చేసిన పొలాల్లో మూడేండ్ల వరకు అంతర్ పంటలు వేసుకునే అవకాశం ఉన్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 1500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
టీఎస్ ఆయిల్ ఫెడ్ ద్వారా మొక్కల పంపిణీ..
రైతులు ఇతర ప్రాంతాల్లో మొక్కలు తె చ్చి నాటితే నష్టపోతారనే ఉద్దేశంతో ప్రభు త్వం రెండు జిల్లాలకు సరిపడా మొక్కలను పెంచుతున్నది. టీఎస్ ఆయిల్ఫెడ్ ద్వారా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని బీచుపల్లి ఆయిల్మిల్లు ప్రాంతంలో రాష్ట్ర నూనె ఉత్పత్తి సహకార సంఘం లిమిటెడ్ ద్వారా ప్రతి జిల్లాకు లక్ష చొప్పున మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడ పెంచే మొక్కలను రైతులకు నవంబర్, డిసెంబర్ నెలలో పంపిణీ చేయనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 206 మంది రైతులు 978.30 ఎకరాల్లో సాగు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో 122 మంది రైతులు 538 ఎకరాలకు, అలంపూర్లో 80 మంది రైతులు 440 ఎకరాల్లో సాగు చేసేందుకు ఐప్లె చేశారు. రైతుల పొలాలను ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించారు. సాగు భూమి, విద్యుత్ సదుపాయం, నీటి లభ్యతను అంచనా వేశారు. రైతులకు ప్రాధాన్యతా క్రమంలో మొక్కలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
సబ్సిడీ ఇలా..
రైతులకు రాష్ట్ర నూనె ఉత్పత్తి సహకార సంఘం లిమిటెడ్ ద్వారా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఎకరాకు 57 మొక్కలను 9 మీటర్ల దూరం చొప్పున త్రికోణాకృతిలో నాటాలి. ఒక మొక్క ఖరీదు రూ.117 కాగా, రూ.84 సబ్సిడీ అందజేయనున్నారు. రైతు రూ.33 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. బిందుసేద్యం ఏర్పాటు చేసుకొనేందుకు దరఖాస్తు చేసుకోవాలి. రైతులు టీఎస్ ఆయిల్ఫెడ్ ఎల్టీడీ పేరున డీడీ తీయాల్సి ఉంటుంది. గద్వాల నియోజకవర్గానికి చెందిన రైతులు క్షేత్ర సహాయకులు సుమంత్ (63012 25279), శివకుమార్ (96035 99080), అలంపూర్ రైతులు బాలప్రకాశ్ (94916 21138), శశిధర్గౌడ్ (7799545418)ను సంప్రదించాలి. మిగతా సమాచారం కోసం గద్వాల ఉద్యానవన అధికారి శ్రీనివాసాచారి (7997725197), అలంపూర్ రాజశేఖర్ (7997725198)కు ఫోన్ చేయొచ్చు.
70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం..
ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కిం ద ఆయిల్పాం సాగుకు జోగుళాం బ గద్వాల, నారాయణపేట జిల్లాలను ఎంపిక చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 1,500 ఎకరాల్లో పంట సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మిగతా లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటాం. ఆయిల్పాం సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చు.