మహబూబ్నగర్, సెప్టెంబర్ 26 : సహకార బ్యాంకుల ద్వారా పేదలకు మరింత మేలు జరిగేలా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశమందిరంలో ఆదివారం డీసీసీబీ మహాజన సభను డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా అధ్యక్షతన నిర్వహించారు. బ్యాంక్ సీఈవో పురుషోత్తంరావు వార్షిక నివేదికను మహాజన సభ్యుల మందుంచారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.21లక్షల 73వేలు లాభం రావడం సంతోషకరమన్నారు. గడిచిన వార్షిక రుణ ప్రణాళికకు సంబంధించి స్వల్పకాలిక రూ.77,546, 97, దీర్ఘకాలిక రుణాలు రూ.2681.65 బట్వాడా చేయడం మంచి విషయమన్నారు. డీసీసీబీ పట్టణంలోని చిరువ్యాపారులకు సైతం రుణాలు అందించడం సంతోషమన్నారు. వరికోత మిషన్కు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మిషన్కు రూ.28లక్షలు ఖర్చు కాగా చేగూర్ సహకార సంఘం 10శాతం, 90శాతం డీసీసీబీ భరించిందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కొరమోని వెంకటయ్య, పాలకవర్గ సభ్యులు విష్ణువర్ధన్రెడ్డి, మంజులారెడ్డి, రఘునందన్రెడ్డి, బక్కన్నయాదవ్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదలకు రక్షణ కవచంలా ఉంటా..
పేదలను రక్షణ కవచంలా ఆదుకునేందుకు నిరంతరం శ్రమిస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గానికి చెందిన 45 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.17,90,500 చెక్కులను అందజేసి మాట్లాడారు. ప్రతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఏదో ఒక రూపకంగా సంక్షేమ పథకాలు అందజేసిందన్నారు. వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ సహాయనిధి నుంచి సాయం అందిస్తున్నామన్నారు.
అవమానపరిస్తే తాట తీస్తామని చెప్పండి
జాతినుద్దేశించి ఎవరైనా అవమానపరిస్తే తాట తీస్తామని హెచ్చరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఆర్వీఎస్ సమావేశ మందిరంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. వేడుకలకు మంత్రి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. భూమికోసం, భుక్తి కో సం పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఐలమ్మ అ డుగజాడల్లో ముందుకుసాగాలని సూచించారు. చాక లి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం సంతోషమన్నారు. ప్రత్యేక హాల్ ఏర్పాటుకు ఆనువైన స్థలంతోపాటు రూ.5లక్షలు ఇచ్చామన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని 20, 9వ వార్డులో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైనే జీ పనులకు ఆదివారం మంత్రి శంకుస్థాపన చేసి మా ట్లాడారు. మన్యకొండ సమీపంలో ఎయిర్పోర్టు రానున్నదని, మన్యంకొండ వేంకటేశ్వర ఎయిర్పోర్ట్గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ కిశోర్, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, అధికారులు ఇందిర, వెంకటేశ్, కౌన్సిలర్లు అనంతరెడ్డి, నరేందర్, పటేల్ప్రవీణ్, కిశోర్, కోఆప్షన్ సభ్యుడు మీర్అర్షద్, నాయకులు పిల్లి సురేశ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.