సుబేదారి, సెప్టెంబర్ 5 : నేరాలకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్షణలు పడేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో వాదనలు వినిపించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. ఆదివారం ఆయన హన్మకొండలోని కమిషనరేట్లో పబ్లిక్ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరస్తులకు కోర్టులో కఠిన శిక్షణలు పడితే, బాధితులకు న్యాయవ్యవస్థ, పోలీసుశాఖపై నమ్మకం, గౌరవం పెరుగుతుందన్నా రు. కోర్టులో కేసులు వీగిపోకుండా పబ్లిక్ప్రాసిక్యూటర్లు శ్రద్ధ తీసుకోవాలని, బలమైన వాదనలు వినిపించి బాధితులకు న్యా యం జరిగేవిధంగా చూడాలన్నారు. 2019 నుంచి 2021 వరకు అత్యధిక కేసుల్లో నిందితులకు శిక్షలుపడడం సంతోషకరమైన విషయమన్నారు. పోలీసుల సందేహాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాసిక్యూటర్ డిప్యూటీ డైరెక్టర్, మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకిల సత్యనారాయణ క్లుప్తంగా వివరించారు. అనంతరం నాలుగో అదనపు జిల్లా కోర్డు సీసీ చెరుకు సత్యనారాయణ, రెండో అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు పీపీ అబ్దుల్నబీ, కరీంనగర్ జిల్లా మూడో అదనపు జిల్లా కోర్టు పీపీ సంజీవరెడ్డిని సీపీ శాలువాతో సన్మానించారు. సమావేశంలో వెస్ట్జోన్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి, సీపీఆర్బీ ఏసీపీ ప్రతాప్కుమార్, హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోర్టులైజనింగ్ అధికారి ఎస్ఐ వెంకటస్వామి పాల్గొన్నారు.