మహబూబ్నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్న ది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నది. మంగళవారం ఆల్మట్టికి 2,91,282 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 3,03,295 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 2,96,722 క్యూ సెక్కుల ఇన్ఫ్లో, 2,98,224 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగింది. జూరాలకు సాయంత్రం వరకు 3,28,600 క్యూ సెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 31 గేట్లు ఎత్తి 2,98,468 క్యూ సెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 10,717 క్యూసెక్కులు మొత్తం కలిపి 3,09,185 క్యూసెక్కులు శ్రీశైలానికి వదిలారు. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టుకు 1,08,819 ఇన్ ఫ్లో వస్తుండగా.. 22 గేట్ల ద్వారా 68,481 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద కొనసాగుతున్న తరుణంలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులను పూర్తి స్థాయి కంటే తక్కువ స్థాయిలో నీటిని నిల్వ ఉంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. 215 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి గానూ శ్రీశైలం ప్రాజెక్టులో ఉదయం 160.9100 టీఎంసీలు ఉండగా, సాయంత్రానికి 172.6615 టీఎంసీలకు చేరుకున్నది. 3,15,856 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విద్యుదుత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కులను నాగార్జునసాగర్కు వదులుతున్నారు. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తే అవకాశం ఉందని ఎస్ఈ వెంకటరమణ తెలిపారు.
తుంగభద్ర పరవళ్లు..
తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్న ది. ఎగువన ఉన్న టీబీ డ్యాం గేట్లు ఎత్తడంతో కర్ణాటకలో ని ఆర్డీఎస్కు వరద పోటెత్తుతున్నది. మంగళవారం ఆనకట్టకు 1,36,800 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా.. 1,36, 300 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 300 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 14 అడుగుల మేర నీటి మట్టం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల పాటు వరద చేరుతుందన్నారు. తుంగభద్ర నదికి భారీగా చేరుతుండడంతో పులికల్ గ్రామ సమీపంలోని నాగల్దిన్నె వంతెన వద్ద వరద ఉధృతి చూపరులను ఆకట్టుకుంటున్నది.
సుంకేసుల డ్యాంకు పోటెత్తిన వరద..
సుంకేసుల డ్యాంకు వరద పోటెత్తుతున్నది. మంగళవారం సాయంత్రం డ్యాంకు 1.07 ల క్షల క్యూసెక్కుల వరద రాగా, 20 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1.06 లక్షల క్యూసెక్కులు విడుదల చే స్తున్నట్లు జేఈ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాత్రికి వరద మ రింత పెరిగే అవకాశం ఉందని, మత్స్యకారులు నదిలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.