మహబూబ్నగర్, సెప్టెంబర్ 26: దివ్యాంగులకు సముచితస్థానం కల్పిస్తూ వారి సమస్యలు తెలుసుకునేందుకు మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణికి ఎంతోమంది ఫిర్యాదుదారులు కలెక్టర్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వస్తున్న విషయం విదితమే. ఈ తరుణంలో దివ్యాంగులు సైతం తమ ఫిర్యాదులను ప్రతి సోమవారం వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. కేవలం దివ్యాంగుల ఫిర్యాదులను మాత్రమే నెలలో ఒకరోజు చివరి బుధవారం తీసుకోవడంతో దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యత చోటుచేసుకున్నది. ప్రజావాణి కార్యక్రమాన్ని దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది
ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నా.. దివ్యాంగులకు ఇబ్బందిగా ఉండేది. సకలాంగుల సమస్యల మాదిరిగానే దివ్యాంగుల సమస్యలు చూసే పరిస్థితులు ఉండేవి. దివ్యాంగుల కోసం మాత్రమే ప్రతినెలా చివరి బుధవారం ప్రజావాణి నిర్వహించడం సంతోషంగా ఉంది. అధికారులు ప్రత్యేకంగా తమ సమస్యలపై దృష్టి సారించేందుకు ఎంతో ఉపయోపడనున్నది.
మంత్రి, కలెక్టర్కు కృతజ్ఞతలు
దివ్యాంగులకు ప్రత్యేకంగా బుధవారం ఫిర్యాదులు తీసుకునేందకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉంది. నెలలో ఒకరోజు తమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. తమ ఫిర్యాదులను తీసుకునేందుకు గుర్తింపు ఇచ్చినందుకుగానూ మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ వెంకట్రావుకు కృతజ్ఞతలు.