ఊట్కూర్/కృష్ణ, సెప్టెంబర్ 23 : వైద్య, ఆరోగ్య శా ఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. వారం రోజులుగా అన్ని పట్టణ కేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకా వేస్తున్నారు. పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ టీకా వేసుకోని వారిని గుర్తించి అవగాహన క ల్పిస్తున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే నా రాయణపేట జిల్లాలోని పలు గ్రామాలు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, కొవిడ్ సెంటర్కు వెళ్లలేని వారిని ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు గుర్తించి టీకా కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఇంటి వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి టీకా వేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో పంచాయ తీ, పాలకవర్గం తీసుకున్న చర్యలతో కేసుల సంఖ్య త గ్గుముఖం పట్టింది. కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి హోం ఐసోలేషన్లో ఉంచి వైద్యుల ప ర్యవేక్షణలో చికిత్స అందించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకవర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మాస్కు ధరించని వారికి జరిమానాలు విధించారు. మాస్కులు, శా నిటైజర్ల వాడకం, భౌతిక దూరంపై గ్రామస్తులకు వివరించారు. హెల్త్ సిబ్బందితో ఫీవర్ సర్వే చేయించి మెడికల్ కిట్లు అందజేశారు. ఇలాంటి చర్యలతో జీరో పాజిటివ్ గ్రామాలుగా మారాయి.
వంద శాతం పూర్తయిన గ్రామాలు..
ఊట్కూర్, కర్ని, పులిమామిడి, మాగనూర్, కృష్ణ, నర్వ పీహెచ్సీల పరిధిలో ఓబ్లాపూర్, నాగిరెడ్డిపల్లి, సంస్థాపూర్, లక్ష్మీపల్లి, మాదన్పల్లి, ముష్టిపల్లి, అంకెన్పల్లి, సోమేశ్వర్బండ, లంకాల, రాంపూర్, ఆలంపల్లి, చేగుంట, తంగిడిగి గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులను అభినందించడంతోపాటు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు..
పాలకవర్గం ఆధ్వర్యంలో లాక్డౌన్ విధించి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. పంచాయతీ ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతోపాటు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వివరించారు. ఇంటి పరిసరాలు, వీధులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
గ్రామంలోనే టీకా వేస్తున్నారు..
కరోనా అంటే ప్రతి ఒ క్కరికీ భయం. మొన్నటి వరకు గ్రామంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. లాక్డౌన్ పెట్టడంతో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తప్పకుండా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోనే క్యాంపు పెట్టి టీకా వేయడంతో పూర్తిగా భయం పోయింది.