దామరగిద్ద, జూలై 18 : మండలంతోపాటు ముస్తాపేట, అయ్యవారిపల్లి, మద్దెలబీడు, అన్నాసాగర్, గడిమున్కన్పల్లి తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. మండలంలోని ప్రధాన వీధుల్లో పాత స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఆశమ్మ, సుభాష్, రాములు, రాఘవేందర్రెడ్డి, లాలప్ప పాల్గొన్నారు.
బాధ్యతగా మొక్కలు నాటాలి
ప్రతిఒక్కరూ అడువుల పెరుగుదలకు మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సర్పంచ్ శివ ప్ప అన్నారు. ప్రభుత్వం తలపెట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని చేగుంటలో స ర్పంచ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అ నంతరం ఇంటింటికీ వెళ్లి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలో రోడ్లు, మురుగు కాల్వలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమం లో నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
‘పర్యావరణాన్ని కాపాడుదాం’
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని సర్పంచ్ కొండ విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ఆదివారం తాసిల్దార్ కార్యాలయం వద్ద మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఇంటి స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాందాసు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ
మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కమిషనర్ నూరుల్నజీబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి ఇంటి ఎదుట ఆరు మొక్కలు నాటేలా అధికారులు, కౌన్సిలర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. అందరూ కలిసి ఆకుపచ్చని ఆదర్శ మున్సిపాలిటీని తయా రు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు పెంచాలని కో రారు. మొక్కలు నాటితే సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణవేణి, మేనేజర్ అశోక్రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కురుణాకర్గౌడ్, మహిళా సం ఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.