ఆత్మకూరు, జూలై 20 : జూరాల ప్రాజెక్టుకు వరద హోరెత్తుతున్నది. మంగళవారం మధ్యాహ్నం 16 గేట్లను ఎత్తారు. రాత్రి 9 గంటలకు 1,05,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 13 గేట్ల ద్వారా 86,060 క్యూసెక్కులు ది గువకు విడుదల చేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడుమ కాలువకు 750, కుడి కాలువకు 328, సమాంతర కాలువకు 150 క్యూసెక్కుల నీటిని వదిలారు. విద్యుదుత్పత్తికి 29,114 క్యూసెక్కులు వినియోగిస్తుండగా మొ త్తంగా 1,17,119 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. ఎగువ జూరాలలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి నిర్వహిస్తుండగా మంగళవారం ఒక్కరోజే 3.59 మిలియన్ యూ నిట్ల ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు మొత్తంగా 42.30 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతుండగా మంగళవారం 3.61 మిలియన్ యూనిట్లతో మొత్తంగా 47.27 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ప్రాజక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా 7.389 టీఎంసీలుగా నమోదైంది.
తుంగభద్రకు 53,885 క్యూసెక్కుల ఇన్ఫ్లో..
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు చేరుతున్నది. మంగళవారం డ్యాం కు 53,885 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అవుట్ఫ్లో 2,621 క్యూసెక్కులు నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు, నిల్వ 100.855 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 1618.45 అడుగుల్లో 54.135 టీఎంసీలు ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
శ్రీశైలానికి..
శ్రీశైలం, జూలై 20 : కృష్ణానది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. జూరాల ప్రాజెక్ట్ గేట్ల ద్వారా 86,060, విద్యుదుత్పత్తి ద్వారా 29,114.. మొ త్తం 1,15,174 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా మంగళవారం రాత్రి 9 గంటలకు 1,53,412 క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 838.90 అడుగుల్లో 60.217 1 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 28,252 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా కుడిగట్టు భూగర్భ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి జరగడం లేదని అధికారులు తెలిపారు.