నారాయణపేట రూరల్, జూలై 7 : నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులదేనని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం మం డలంలోని కొల్లంపల్లి, అమ్మిరెడ్డిపల్లి, కోటకొండ తదితర గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కొల్లంపల్లిలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ సా యిరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. నాటిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని, మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వొద్ద ని సూచించారు. జాజాపూర్లో సర్పంచ్ సుగందమ్మ ప్రత్యే క చొరవతో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగేందుకు కృషి చేస్తున్నారని, ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీ సుకొని మొక్కలు పెంచాలని కలెక్టర్ సర్పంచులకు సూచించారు. అమ్మిరెడ్డిపల్లిలో క్రిమిటోరియం, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కోటకొండలో పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని పరిశీలించారు. పది రోజులపాటు చేపడుతున్న పల్లె ప్రగతి పనులను రోజూ వారీగా షెడ్యూల్ ప్రకారం ము మ్మరంగా సాగుతున్నాయని, అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు, సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్నాయక్, మండల ప్రత్యేకాధికా రి జైపాల్రెడ్డి, అటవీ శాఖ అధికారి నారాయణరావు, స ర్పంచులు, కార్యదర్శులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.
ముమ్మరంగా శ్రమదానం
ఊట్కూర్, జూలై 7 : మండలంలోని పె ద్దజట్రం, తిమ్మారెడ్డిపల్లి తండాలో గ్రామస్తు లు శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తను ఊ డ్చి శుభ్రం చేశారు. ఆయా వార్డుల్లో ప్లాస్టిక్ కాగితాలను సేకరించి ప్రజలకు వాటి వలన కలిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ ని యంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపు లా మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ఊట్కూర్, చిన్నపొర్ల, పెద్దపొర్ల, తి ప్రాస్పల్లి, పులిమామిడి తదితర గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో మురుగునీటి కా ల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప గ్రామాలను సందర్శించారు. పచ్చదనం, పరిశుభ్రత కు నిలయాలుగా గ్రామాలను తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో రవికుమార్, సర్పంచులు, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
కృష్ణ, జూలై 7 : మాగనూర్ మండంలోని గురావ్ లిం గంపల్లి పల్లె ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మొక్కలు నాటారు. ఇంటింటికీ తిరుగుతూ మొ క్కలను పంపిణీ చేశారు. అలాగే పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. వీధి రోడ్లు, మురుగునీటి కాల్వలను పరిశీలించారు. సమస్యలు ఉంటే త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయా గ్రామాల సర్సంచులు కోరారు. మండల కేంద్రంతోపాటు చేగుంట, గుడెబల్లూర్ తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధితోపాటు పరిశుభ్రత, పచ్చదనంతో నందనవనం గా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. .