మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 28: ఉమ్మడి జిల్లాలో ఐదుగురు జడ్జీ లు బదిలీ అయ్యారు. కాగా, వారి స్థానంలో శనివారం నూతన న్యాయమూర్తులను నియమిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సెషన్స్ జడ్జీలను రాష్ట్రవ్యాప్తంగా బది లీ చేశారు. జోగుళాంబ గద్వాల కోర్టుకు ఎం.కనకదుర్గ అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించారు. పీ అన్నీరోస్ క్రిస్టియాన్ మహబూబ్నగర్ జిల్లా కోర్టులో జిల్లా సెషన్స్ జడ్జి, ఫాస్ట్ట్రాక్కు నియమించారు. వై.పద్మ జడ్జి హైదరాబాద్, మహబూబ్నగర్ జడ్జి, ఫాస్ట్ట్రాక్, మహిళా న్యాయమూర్తిగా కేటాయించారు. సీనియర్ సివిల్ జడ్జిగా ఎంకే పద్మావతిని మహబూబ్నగర్ జిల్లా సెక్రటరీ, లీగల్ సర్వీసెస్ ఆథారిటీగా జిల్లాకు నియమించారు. గంట కవితాదేవి సీనియర్ సివిల్ జడ్జిగా గద్వాల, వనపర్తి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు.