కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 19: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరం సైనికుల్లా పనిచేయాలని జిల్లా వైధ్యాధికారి సుధాకర్లాల్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్లో ఇంటిం టా సర్వే నిర్వహిస్తున్న తీరును ఆయన ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుధాకర్లాల్ మాట్లాడుతూ తమ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.
ఇప్పలతండాలో వందశాతం వ్యాక్సినేషన్
అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా టీకా వేయాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్ అన్నారు. మండలంలోని ఇప్పలతండాను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ టీకా వంద శాతం అ మలులో ఇప్పలతాండా జిల్లాకే ఆదర్శంగా నిలిచిందన్నారు. వందశాతం వ్యాక్సినేషన్కు కృషి చేసిన సిబ్బందిని, ప్రజాప్రతినిధులను, ఉద్యోగులను డీఎంహెచ్వో అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి వెంకటదాస్, ఇమ్యూనైజేషన్ అధికారి సాయినాథ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరూ టీకా వేసుకోవాలి
అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని 2వ వార్డు కౌన్సిలర్ యాదమ్మ పిలుపునిచ్చా రు. కల్వకుర్తి 2వ వార్డులో వ్యాక్సిన్ కేంద్రాన్ని యాదమ్మ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటా సర్వే నిర్వహించి 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ వేయిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, బావండ్ల మధు, నాయకులు ఆనంద్, శ్రీశైలం, కృష్ణయ్య, అల్లాజీ, వెంకటమ్మ, యాదమ్మ, బక్కయ్య, వైద్య సిబ్బంది ప్రసాద్, ఆశ వర్కర్ సరిత పాల్గొన్నారు.
21వ వార్డులో ఇంటింటి సర్వే
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 21వ వార్డులో ఆదివారం మున్సిపల్ కౌన్సిలర్ సైదులుగౌడ్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేశారు. అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ స్టిక్కర్లు అతికించారు. కార్యక్రమంలో ఆర్పీలు లక్ష్మి, రేణుక, వాటర్మెన్ శ్రీను, టీఆర్ఎస్ నాయకులు శేఖర్గౌడ్, సాయి, రాజేశ్, ఓంప్రకాశ్, చంద్రకిరణ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
కల్వకుర్తి మండలంలో..
కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్19 : 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కల్వకుర్తి మున్సిపల్, మెప్మా సిబ్బంది సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని ఆయా వార్డుల్లో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా వివరాలు సేకరించి స్టిక్కర్లు అతికించారు.
పీహెచ్సీ తనిఖీ
మండలకేంద్రంలోని పీహెచ్సీలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను డిప్యూటీ డీఎంహెచ్వో వెంకటదాస్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. ఆయన వెంట డాక్టర్ సుబ్బారెడ్డి, ఎంపీహెచ్ఈవో ఎన్డీవీ చారి, ఏఎన్ఎంలు లక్ష్మీకుమారి, ఆశ కార్యకర్తలు సుమతి, సునీత, జ్యోతి, శశికళ, బాలమణి తదితరులున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పెంట్లవెల్లి, సెప్టెంబర్ 19 : మండలంలోని ఆయా గ్రామాల కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి చంద్రశేఖర్ అన్నారు.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి ఆదివారం ప్రకటనలో సూచించారు. అందరూ సహకరిస్తే కరోనాను నియంత్రిచవచ్చన్నారు.