మహబూబ్నగర్టౌన్, జూలై 25 : కరాటేతో ఆత్మరక్షణ లభిస్తుందని మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ అన్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఈ-కటాస్ ఏఎస్ఏఐ చాంపియన్షిప్లో కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభచాటి పతకాలు సాధించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ అంతర్జాతీయ ఆన్లైన్ కరాటే టోర్నీలో జిల్లా విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. బాలబాలికలు మార్షల్ ఆర్ట్స్లో రాణించి గుర్తింపు పొందాలని సూచించారు. కాగా, టోర్నీలో క్లబ్ విద్యార్థులు నేహాఫాతిమా, మహ్మద్ అర్షజమీల్, హుజేఫ్ బంగారం పతకాలు, నవీన్, ఫైజాన్ రజత పతకాలు, ఖాజాపాషా, శ్రావణి కాంస్య పతకాలు సాధించినట్లు మాస్టర్ జహంగీర్పాషా ఖాద్రీ తెలిపారు. కార్యక్రమంలో కింగ్ షోటోకాన్ కరాటే క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీక్పటేల్, కార్యదర్శి మహ్మద్జకీ, ఉపాధ్యక్షుడు హమీద్అలీ, తిరుపతయ్య పాల్గొన్నారు.