మహబూబ్నగర్ జూలై 19 : ఒకేరో జూ 10లక్షల మొక్కలు నాటేందుకు ప్ర ణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రా వు అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బృహత్ పల్లె ప్రకృతి వనా ల్లో వందశాతం మొక్కలు నాటాలని సూ చించారు. వసతి గృహాల మరమ్మతుకు రూ.5లక్షల చొప్పున మంజూరయ్యాయ ని తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 24న మ హబూబ్నగర్లోని మయూరీ, వీరన్నపేట, సమీకృత కలెక్టరేట్తోపాటు జిల్లా అధికారుల భవన స ముదాయాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే పల్లె, పట్టణ ప్రగతి పనులను పూర్తి చేయాలని సూచించారు. రూ ర్బన్ పథకం కింద మహ్మదాబాద్, గండీడ్ మండలాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సి ద్ధం కావాలనానరు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత తదితరు లు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
నూతన కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ ప నులను పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. నూత న కలెక్టరేట్ భవనంలో చేపడుతున్న పనులను ప రిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ మొదటి హెల్ప్యాడ్ పనులు పూర్తయ్యాయ ని, రెండో హెలిప్యాడ్ పనులు కూడా వెంటనే ప్రా రంభించి పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువులో పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్వామి, స హాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రశాంత్ తదితరు లు పాల్గొన్నారు.
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
అధికారుల దృష్టికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్ర జల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 13 ఫిర్యాదులు ఆన్లైన్లో రాగా, 2 ఫిర్యాదులు నేరుగా వ చ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత తదితరు లు పాల్గొన్నారు.