మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం భారీగా వరద రానున్నది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వ ర్షాల ప్రభావంతో ఆల్మట్టి, నా రాయణపూర్ ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున ఇన్ఫ్లో నమోదవుతున్నది. మరోవైపు కృష్ణానది ఉపనదులైన తుంగభద్ర, భీమా న దులకు సైతం వర ద పెరుగుతున్నది. దీని ప్రభావంతో శుక్రవారం అ ర్ధరాత్రి నాటికి జూరాలకు నారాయణపూర్ నుంచే సుమారు 1.80 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా రు. మరోవైపు భీమా నదీ తీర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం ఉదయం నాటికి సుమారు 2 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగే అవకా శం ఉందని అంచనా. గురువారం రాత్రి ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. నారాయణపూర్ నుంచి గురువారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. నారాయణపూర్ నుంచి వి డుదలైన వరద జూరాలకు శుక్రవారం అర్ధరాత్రి చే రుకుంటుందని అధికారుల అంచనా. మరోవైపు భీమాకు సైతం వరద వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రెండు మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండి నీటిని దిగువకు వదలొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 117.24 టీఎంసీలు కాగా.. 63 టీఎంసీలకు చేరుకున్నది. ఉజ్జయి ని నిండితే భీమా నుంచి జూరాలకు భారీగా వరద రావొచ్చు. కృష్ణానదికి భారీగా వరద పెరిగిన నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో శ్రీశైలం పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి చేరే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయని నీటిపారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు. నారాయణపూర్ నుంచి గురువారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి న నేపథ్యంలో నదీతీర ప్రాంతంలో ఉన్న నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని రైతులను, సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.నది ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.