వనపర్తి, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండవర్ణాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఆమె విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా, జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ తెగువ అందరికీ స్ఫూర్తిదాయకమని, సాధారణ మహిళ అయిఉండి అప్పట్లో దొరల గడిని గడగడలాడించిన యోధురాలని కొనియాడారు. న్యాయం, నిబద్ధత వైపు నిలబడేందుకు ఐలమ్మ స్ఫూరిదాయకమని దండలు వేయడం, శ్రద్ధ్దాంజలి, పుష్పాంజలి ఘటించడం కాకుండా ఏ విలువలు, ఏ ఆశయాల కోసం ఆమె నిలబడిందన్న విషయాన్ని గమనించాలన్నారు. ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఏటా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
మహిళలకు స్ఫూర్తిదాయకం
మహిళలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని, ప్రభుత్వం ఏటా ఆమె జయంతిని ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నదని కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, అంకిత్, బీసీ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, తాసిల్దార్ రాజేందర్గౌడ్, కౌన్సిలర్లు, రజకసంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చందాపూర్ ఆదర్శంగా నిలుస్తుంది
చందాపూర్ గ్రామంలో చూస్తున్న అభివృద్ధి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలు స్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చందాపూర్లో ఆదివారం ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి పల్లె ప్రకృతివనం, రైతు వేదికను పరిశీలించి సమావేశంలో మంత్రి మాట్లాడారు. సర్పంచ్ చెన్నారెడ్డి కృషివల్ల ప్రకృతివనంలో మొక్కలు ఏపుగా పెరిగాయన్నారు. అరటిపండ్లు త్వరలోనే వస్తాయని, సర్పంచ్ కృషికి గ్రామస్తుల తోడ్పాటు, సహకారం అభినందనీయమన్నారు. వచ్చే జెడ్పీ సమావేశం ఇక్కడే నిర్వహించి సభ్యులకు గ్రామాభివృద్ధిని చూపించాలన్నారు. యాసంగిలో రైతులు పంట మార్పు చేసుకొని వేరుశనగ, మినుములు తదితర పంటలపై దృష్టి సారించాలన్నారు. చందాపూర్తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరందించే దిశగా రామన్నగుట్ట ప్రాంతంలో 1.5టీఎంసీ రిజర్వాయర్ ఏర్పాటుచేసే ఫైల్ సీఎం అనుమతి కోసం పంపించామన్నారు. అనంతరం గ్రామాభివృద్ధికి కృషిచేస్తున్న సర్పంచ్ చెన్నారెడ్డిని మంత్రి నిరంజన్రెడ్డి శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాణిక్యం, సింగిల్విండో చైర్మన్ వెంకట్రావు, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్ది, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహ, మార్క్ఫెడ్ కమిటీ డైరెక్టర్ విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.