నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23 : పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేసి అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమ లు చేస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువా రం నాగర్కర్నూల్ క్యాంపు కా ర్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని తిమ్మాజిపేట, తాడూ రు, నాగర్కర్నూల్ మండలాల కు చెందిన 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం అమలుతో ఆ కుటుంబానికి ఆసరగా నిలువడం వల్ల ప్రతి పేదింట ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన కేసీఆర్ చేసి ఈ పథకం అమలు పరిచారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందుతున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ ప్రజాప్రతినిధికి కూడా పేదింటికి సాయం చేయాలన్న ఆలోచన లేకపోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పథకం అమలు తో ఆడబిడ్డనే కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఏదో రకంగా లబ్ధి చేకూరుతుందని ఆయనన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నాగమణి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హన్మంత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనా భాస్కర్గౌడ్, తాసిల్దార్ ఖా జాపాషా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.